తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఆహార భద్రతా కమిషనర్ సంగీత సత్యనారాయణ ఆదేశాల మేరకు ప్రజా పాలన ప్రగతి ప్రణాలికలో భాగంగా, ప్రపంచ ఆహార దినోత్సవం సందర్భంగా ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆహార భద్రతా విభాగం.ఆధ్వర్యంలో జిల్లాలోని అంగన్వాడీ ఉపాధ్యాయులకు ఆహార భద్రత శిక్షణ, ధృవీకరణ కార్యక్రమాన్ని నిర్వహించింది. జిల్లా నుండి మొత్తం 300 మంది అంగన్వాడీ ఉపాధ్యాయులు 2 బ్యాచ్లలో పాల్గొన్నారు. దీనితో పాటుగా అంగన్వాడీల కోసం రిజిస్ట్రేషన్ మేళా కూడా నిర్వహించబడింది. ఈ సందర్భంగా జిల్లా డిఎమ్హెచ్ఓ డాక్టర్ తుకారాం రాథోడ్ మాట్లాడుతూ..సురక్షితమైన ఆహారం, సురక్షితమైన ఆరోగ్యం ప్రధాన ఉద్దేశ్యంగా ఉండాలని అన్నారు. జిల్లాలో క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహిస్తామని, కల్తీపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఆహార భద్రతా అధికారి శరత్ తెలిపారు. ఏవైనా ఫిర్యాదుల కోసం కొత్తగూడెం, ఐడిఓసి, 1వ అంతస్తు, రూమ్ నెం. ఎఫ్3 లోని కార్యాలయాన్ని సంప్రదించాలని కోరారు.
Admin
తెలుగు వెలుగు టీవీ