తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: జిల్లా కేంద్రమైన కొత్తగూడెం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్లో మహిళ సీఐ వేధింపులు తాళలేక ఓ మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటనపై బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు స్పందించారు. బాధితుల పక్షాన నిలబడతామని వెంటనే బాధితురాలైన మహిళా కానిస్టేబుల్ కి జరిగిన అన్యాయంపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి వెంటనే చర్యలు తీసుకోవాలని జిల్లా అబ్కారీ అధికారి జానయ్య తో రేగా కాంతారావు ఫోన్లో మాట్లాడారు. ఈ విషయంలో ఎలాంటి లాలూచీలు లేకుండా వెంటనే సమస్య పరిష్కరించే విధంగా అధికారులు నిష్పక్షపాతంగా పనిచేయాలని తెలిపారు. అదేవిధంగా బాధితురాలైన సదరు మహిళా కానిస్టేబుల్ తో సైతం రేగా కాంతారావు ఫోన్లో మాట్లాడారు. సిబ్బందికి ఎప్పుడు ఆపద వచ్చినా తోడుగా నిలబడతామని, ఈ విషయంలో ఎవరు ఆందోళన చెందాల్సిన పనిలేదని ఆయన ధైర్యాన్ని ఇచ్చారు. పదిమంది ఒక్కసారిగా విధులు బహిష్కరించడం శోచనీయమని, ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా సరైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అధికారులకు సూచించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ