తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం ( తెలుగు వెలుగు ) : దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సర్ కార్యక్రమంలో భాగంగా జూలూరుపాడు మండలం లోని పలు గ్రామాల్లో జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని జిల్లా ప్రజా పరిషత్ ముఖ్య కార్యనిర్వాహక అధికారి (సీఈఓ) శ్రీమతి బి. నాగలక్ష్మి ఈరోజు జూలూరుపాడు మండలంలో పర్యటించి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమం అమలు తీరును మాచినపేట తండా, అన్నారుపాడు మరియు పాపకొల్లు గ్రామాలలో క్షేత్రస్థాయిలో పరిశీలించారు. క్లస్టర్ లెవల్ స్పెషల్ ఆఫీసర్గా ఆమె ఈ కార్యక్రమం పురోగతిని సమీక్షించి, ఓటర్లతో మాట్లాడి అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో తమ పేర్లను నమోదు చేసుకోవాలని, అవసరమైన మార్పులు, చేర్పులు, తొలగింపులు నిర్ణీత గడువులో పూర్తి చేసుకోవాలని సూచించారు. అనంతరం మండలంలోని విలేజ్ ఆర్గనైజేషన్ (VO) భవనాల నిర్మాణ పనులను పరిశీలించి, పనుల పురోగతి సంతృప్తికరంగా ఉందని పేర్కొన్నారు. అలాగే గ్రామాల్లో ఏర్పాటు చేసిన డ్రైన్ల ఎండ్ సోక్పిట్లను పరిశీలించి, వాటిని ప్రజలకు ఉపయోగపడే విధంగా నాణ్యతతో పూర్తి చేయాలని సూచించారు. పాపకొల్లు గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఈజీఎస్) ద్వారా నిర్మించిన గ్రావెల్ రోడ్డును పరిశీలించారు. అలాగే జూలూరుపాడు గ్రామపంచాయతీలో చేపట్టిన మొక్కల నాటే కార్యక్రమాన్ని పరిశీలించి పర్యావరణ పరిరక్షణలో భాగంగా విస్తృతంగా మొక్కలు నాటి వాటి సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా మండలంలో కొనసాగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను సమీక్షించిన సీఈఓ ప్రారంభించాల్సిన అభివృద్ధి పనులను వెంటనే ప్రారంభించి, కొనసాగుతున్న పనులను నాణ్యతతో త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ పర్యటనలో మండల పరిషత్ అభివృద్ధి తాళ్లూరి రవి మండల పంచాయతీ అధికారి తులసి రామ్, ఏపీవో రామారావు, పి ఆర్ఏ ఈ నవీన్ కుమార్, గ్రామపంచాయతీ సర్పంచులు గ్రామపంచాయతీ సిబ్బంది, సంబంధిత శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ