Monday, 03 August 2026 12:27:38 PM
# సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్: ₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం. # ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో స్కార్ఫ్ డే # సుజాత నగర్, బాలాజి నగర్ ల్లో వీధి కుక్కల బెడత. # జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకోండి – పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించండి. # నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ & పీఎం) కిరణ్ కుమార్‌కు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు. # భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు, ERO రవికుమార్. # 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం. # ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు, బిఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి . # 50 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్. # సారపాక,రెడ్డిపాలెం, తూర్పాక,దుమ్ముగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # తాటి సురేష్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా, కోమరి కృష్ణ సన్మానం. # భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మేరా యువ భారత్, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఘనంగా ముగిసిన 8 రకాల జిల్లాస్థాయి పోటీలు. # ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం. # గోదావరి వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # 16వ డివిజన్లో నూతన కాలువ నిర్మాణ పనులు ప్రారంభం.కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘన సన్మానం. # కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై సమరశంఖం పూరించాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

గ్రామాల్లో జరుగుతున్నటువంటి ఎస్ ఐ ఆర్ కార్యక్రమాన్ని పరిశీలించిన సీఈఓ బి నాగలక్ష్మి

Date : 14 July 2026 05:41 PM Views : 157

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం ( తెలుగు వెలుగు ) : దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సర్ కార్యక్రమంలో భాగంగా జూలూరుపాడు మండలం లోని పలు గ్రామాల్లో జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని జిల్లా ప్రజా పరిషత్ ముఖ్య కార్యనిర్వాహక అధికారి (సీఈఓ) శ్రీమతి బి. నాగలక్ష్మి ఈరోజు జూలూరుపాడు మండలంలో పర్యటించి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమం అమలు తీరును మాచినపేట తండా, అన్నారుపాడు మరియు పాపకొల్లు గ్రామాలలో క్షేత్రస్థాయిలో పరిశీలించారు. క్లస్టర్ లెవల్ స్పెషల్ ఆఫీసర్‌గా ఆమె ఈ కార్యక్రమం పురోగతిని సమీక్షించి, ఓటర్లతో మాట్లాడి అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో తమ పేర్లను నమోదు చేసుకోవాలని, అవసరమైన మార్పులు, చేర్పులు, తొలగింపులు నిర్ణీత గడువులో పూర్తి చేసుకోవాలని సూచించారు. అనంతరం మండలంలోని విలేజ్ ఆర్గనైజేషన్ (VO) భవనాల నిర్మాణ పనులను పరిశీలించి, పనుల పురోగతి సంతృప్తికరంగా ఉందని పేర్కొన్నారు. అలాగే గ్రామాల్లో ఏర్పాటు చేసిన డ్రైన్ల ఎండ్ సోక్‌పిట్లను పరిశీలించి, వాటిని ప్రజలకు ఉపయోగపడే విధంగా నాణ్యతతో పూర్తి చేయాలని సూచించారు. పాపకొల్లు గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఈజీఎస్) ద్వారా నిర్మించిన గ్రావెల్ రోడ్డును పరిశీలించారు. అలాగే జూలూరుపాడు గ్రామపంచాయతీలో చేపట్టిన మొక్కల నాటే కార్యక్రమాన్ని పరిశీలించి పర్యావరణ పరిరక్షణలో భాగంగా విస్తృతంగా మొక్కలు నాటి వాటి సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా మండలంలో కొనసాగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను సమీక్షించిన సీఈఓ ప్రారంభించాల్సిన అభివృద్ధి పనులను వెంటనే ప్రారంభించి, కొనసాగుతున్న పనులను నాణ్యతతో త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ పర్యటనలో మండల పరిషత్ అభివృద్ధి తాళ్లూరి రవి మండల పంచాయతీ అధికారి తులసి రామ్, ఏపీవో రామారావు, పి ఆర్ఏ ఈ నవీన్ కుమార్, గ్రామపంచాయతీ సర్పంచులు గ్రామపంచాయతీ సిబ్బంది, సంబంధిత శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :