తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొనిజర్ల : గిరిజనుల హక్కులు, సమస్యల సాధనకు పోరాడుతాం 18న మహా ప్రదర్శన, 19న ప్రతినిధుల సభ మహాసభల ప్రచార కరపత్రాల విడుదల : సిపిఐ పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య గిరిజన సమాఖ్య మూడో రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని సిపిఐ పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య పిలుపునిచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణ పరిధిలోని సిపిఐ పార్టీ జిల్లా కార్యాలయం 'శేషగిరిభవన్'లో మంగళవారం పట్టణ సమితి ఆధ్వర్యంలో ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా గిరిజన సమాఖ్య మహాసభల ప్రచార కరపత్రాలను విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గిరిజనుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం, వారి హక్కుల సాధన కోసం నిరంతరం పోరాడుతామని స్పష్టం చేశారు. ఈ నెల 18, 19 తేదీల్లో పాల్వంచలో తెలంగాణ గిరిజన సమాఖ్య (టిజిఎస్) మూడో రాష్ట్ర మహాసభలు అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతాయని వివరించారు. మహాసభల తొలిరోజు మధ్యాహ్నం భారీ ఎత్తున మహా ప్రదర్శన, బహిరంగ సభ ఉంటాయని, 19న ప్రతినిధుల సభ లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ హాల్ నందు జరుగుతుందని తెలిపారు. ఈ పోరాట మహాసభల్లో గిరిజనులు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఆయన కోరారు. సమావేశంలో సిపిఐ నాయకులు గెడ్డాడు నగేష్, మాచర్ల శ్రీనివాస్, నిమ్మగడ్డ వెంకటేశ్వరరావు, ఎండి యూసుఫ్, నేరెళ్ల శ్రీను, కృష్ణ, వాడే రాములు, మండల రాజేశ్వర్ రావు, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ