తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : అశ్వారావుపేట మండలం కొత్తగంగారం గ్రామ సమీపంలో జరుగుతున్న కోడిపందాల స్థావరాలపై పోలీసులు దాడి నిర్వహించారు. ఎస్ఐ యయాతి రాజు కథనం ప్రకారం కొత్తగంగారంలో కోడిపందాలు బుధవారం సాయంత్రం నిర్వహిస్తున్నారన్న సమాచారంతో తాము సిబ్బందితో దాడిచేసి ఏడుగురిని అదుపులోకి తీసుకున్నామని, ఆరు కోడిపుంజులు, ఏడు ద్విచక్ర వాహనాలు, 1200 నగదు స్వాధీనపరచుకున్నట్లు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ