Sunday, 02 August 2026 04:55:55 AM
# సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్: ₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం. # ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో స్కార్ఫ్ డే # సుజాత నగర్, బాలాజి నగర్ ల్లో వీధి కుక్కల బెడత. # జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకోండి – పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించండి. # నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ & పీఎం) కిరణ్ కుమార్‌కు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు. # భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు, ERO రవికుమార్. # 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం. # ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు, బిఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి . # 50 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్. # సారపాక,రెడ్డిపాలెం, తూర్పాక,దుమ్ముగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # తాటి సురేష్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా, కోమరి కృష్ణ సన్మానం. # భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మేరా యువ భారత్, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఘనంగా ముగిసిన 8 రకాల జిల్లాస్థాయి పోటీలు. # ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం. # గోదావరి వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # 16వ డివిజన్లో నూతన కాలువ నిర్మాణ పనులు ప్రారంభం.కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘన సన్మానం. # కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై సమరశంఖం పూరించాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

ప్రజా పోరాటాలకు రాజకీయ శిక్షణ ఎంతో దోహదపడాలి : సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాగం హేమంతరావు

Date : 09 July 2026 04:50 PM Views : 100

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలి పాలకుల ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటాల ఉధృతిని పెంచాలి సమకాలీన సామాజిక సమస్యల పరిష్కారానికి నిరంతరం శ్రమించాలి కమ్యూనిస్టు పార్టీ ఆశయాల సాధనకు కార్యకర్తలు అంకితభావంతో పనిచేయాలి ప్రజా పక్షాన నిలబడి పోరాడటమే నాయకుల, కార్యకర్తల ప్రధాన బాధ్యత సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాగం హేమంతరావు ప్రజా పోరాటాలకు మూడు రోజులపాటు జరిగిన రాజకీయ శిక్షణ దోహదపడాలని, ప్రజలను చైతన్యపరిచి పోరాటాల వైపు నడిపించే చైతన్య తీసుకురావాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాగం హేమంతరావు అన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కౌన్సిల్ సమావేశం గురువారం భద్రాచలంలోని రెడ్డి సత్రంలో జరిగింది. మూడు రోజుల పాటు జరిగిన భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల కౌన్సిల్ సభ్యుల రాజకీయ శిక్షణా తరగతుల ముగింపు అనంతరం ఈ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడు రోజుల పాటు సాగిన శిక్షణా తరగతులపై సమగ్రంగా సమీక్ష జరిపారు. ఓటర్ల జాబితా సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియ అత్యంత కీలకమైనదని, ఇందులో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పాలకులు అవలంబిస్తున్న ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటాల ఉధృతిని పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. సిపిఐ జిల్లా కార్యదర్శి SK సాబీర్ పాషా మాట్లాడుతూ కమ్యూనిస్టు పార్టీ నాయకులు, కార్యకర్తలు నిత్యం ప్రజల్లో ఉంటూ సమకాలీన సామాజిక సమస్యల పరిష్కారానికి నిరంతరం శ్రమించాలన్నారు. కమ్యూనిస్టు పార్టీ ఆశయాల సాధనకు కార్యకర్తలు అంకితభావంతో పనిచేయాలని, ప్రజా పక్షాన నిలబడి పోరాడటమే నాయకుల, కార్యకర్తల ప్రధాన బాధ్యతని అన్నారు. చలో ఢిల్లీ, జిల్లా వ్యాప్త పాదయాత్రలు, అంగన్వాడీ యూనియన్ పాదయాత్ర, గిరిజన సమాఖ్య రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాల్సిన బాధ్యత పార్టీ శ్రేణులపై ఉందని, అందుకోసం ప్రతి కార్యకర్త తనవంతు కర్తవ్యాన్ని నిర్వర్తించాలని సూచించారు. నరాటి ప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సిపిఐ రాష్ట్ర నాయకులు ముత్యాల విశ్వనాథం కల్లూరు వెంకటేశ్వరరావు, జిల్లా కార్యవర్గ సభ్యులు ఎస్ పుల్లారెడ్డి, ఎస్ డి సలీం, వెంకటేశ్వరరావు, సలిగంటి శ్రీనివాస్, మున్నా లక్ష్మీకుమారి, వి పూర్ణచంద్రరావు, చంద్ర నరేంద్ర కుమార్, కంచర్ల జమలయ్య, మువ్వ వెంకటేశ్వరరావు, రేసు ఎల్లయ్య, వాసిరెడ్డి మురళి, కందుల భాస్కర్, ఉప్పుశెట్టి రాహుల్, ఎస్ కే ఫహీమ్, దేవరకొండ శంకర్ తాతాజీ తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :