తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెంజిల్లా జులై 9తెలుగు వెలుగు ) చండ్రుగొండ మండలం, అన్నపురెడ్డిపల్లి మండలాల లో ఇంటిలిజెన్స్ గా విధులు నిర్వహిస్తున్న జూలూరుపాడు మండలం న్యూ కాలనీ కి చెందిన హెడ్ కానిస్టేబుల్ కల్లోజి విజయ్ కుమార్ కు ఏఎస్ఐ గా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.దీంతో మెయిన్ ఇంటెలిజెన్స్ నందు బుధవారం రోజు న బాధ్యతలు స్వీకరించారు. ఏఎస్ఐ గా పదోన్నతి పొందిన విజయ్ కుమార్ గురించి చిన్ననాటి స్నేహితులు మాట్లాడుతూ విజయ్ కుమార్ పాఠశాల లో చదివినపడనుండి చాలా క్రమశిక్షణ కలిగి ఉంటాడని, ఏదైనా అనుకుంటే లక్ష్యాన్ని సాధించేంతవరకు పట్టుదలగా వ్యవహరిస్తాడని, పెద్దలపట్ల గౌరవంగా, స్నేహితుల దగ్గర సన్నిహితంగా ఉంటాడని విజయ్ కి పదోన్నతి రావడంపై చాలా ఆనందంగా ఉందని అన్నారు. సన్నిహితులు మరియు తోటి ఉద్యోగులు విజయ కుమారును అభినందించారు ఈ సందర్భంగా ఏ ఎస్సై విజయ్ కుమార్ మాట్లాడుతూ విధి నిర్వహణలో నిర్లక్ష్యం చేయకుండా ఉన్నతాధికారుల ఆదేశానుసారం నడుచుకుంటానన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ