Wednesday, 16 September 2026 06:15:17 AM
# సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ఏజెన్సీ ప్రాంత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత టివిఆర్ చంద్రం.పుస్తకావిష్కరణ సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా. # ప్రభుత్వ లిఖితపూర్వక హామీతోనే ‘చలో హైదరాబాద్’ తాత్కాలిక వాయిదా: TGEJAC ఛైర్మన్ అమరనేని రామారావు. # చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం: టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు.

కొత్తగూడెం ఏరియాలో ఘనంగా నిర్వహించిన జాతీయ ఐక్యతా దినోత్సవం

Date : 31 October 2025 05:40 PM Views : 377

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం ఏరియాలో జి‌ఎం కార్యలయంలో తేదీ 31.10.2025 (శుక్రవారం)న జాతీయ ఐక్యతా దినోత్సవ కార్యక్రమం ఘానంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధి గా ఏరియా జనరల్ మేనేజర్ ఎం. షాలేం రాజు హాజరైయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ … భారత దేశ తొలి హోం మంత్రి గౌరవ సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ జయంతి సందర్భంగా జాతీయ ఐఖ్యతా దినోత్సవం జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. స్వాతంత్ర్యం రాక ముందు మన దేశం అనేక సంస్థానాలుగా ఉండేదని, ఉక్కు మనిషి శ్రీ సర్దార్ పటేల్ కృషి వల్లనే స్వాతంత్ర్యానంతరం అన్ని సంస్థానాల విలీనం జరిగిందన్నారు. ఐఖ్యత గా ఉంటే అన్ని సాదించగలం, ఇదే స్ఫూర్తితో ఐకమత్యంగా సింగరేణి లోనే మన కొత్తగూడెం ఏరియాకు నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించడంలో ముందున్నామని అన్నారు ఇంత పెద్ద సంస్ధ లో మనందరం ఎన్నో కులాలు, మతాలకు చెందినవారమైనా గాని సమిష్టి కృషితో పనిచేస్తూ ఉత్తమమైన ఫలితాలను పొంది, కంపెనీ పురోభివృద్ధికి తోడ్పడాలని అన్నారు. అందరూ సమైఖ్యతతో సోదర భావంతో మెలగాలని అన్నారు. ఈ సందర్భంగా డిజిఎం (పర్సనల్) జీవి మోహన్ రావు గారు ఉద్యోగులందరిచే దేశ సమగ్రతను, ఐఖ్యతను, భద్రతను కాపాడటంలో అంకిత భావంతో వ్యవహరించాలని ప్రతిజ్ఞ చేశారు. అదే విదముగా కొత్తగూడెం ఏరియా లోని అన్ని గనులు మరియు డిపార్ట్మెంట్లలో కూడా ఆయా గనుల మేనేజర్లు మరియు ఆదిపతులు ఉద్యోగులందరిచే జాతీయ ఐఖ్యతా దినోత్సవ ప్రతిజ్ఞ చేపించారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం ఏరియా ఏఐటియుసి బ్రాంచ్ సెక్రటరీ వి. మల్లికార్జునరావు, ఐఎన్టీయూసీ వైస్ ప్రెసిడెంట్ ఎండి.రజాక్, అధికారుల సంఘం జనరల్ సెక్రటరీ ఏ.ఉపేంద్ర బాబు ఎస్ఓటు జిఎం జివి కోటిరెడ్డి, డి‌జి‌ఎం (పర్సనల్) జీవి మోహన్ రావు, డి‌జి‌ఎం (ఐ‌ఈ) ఎన్. యోహాన్, ఇతర విభాగాధిపతులు, అధికారులు మరియు జి‌ఎం కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :