తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : 27/3/26 శ్రీరామ నవమి సందర్భంగా పాల్వంచ భజన మందిరంలో ఉ: 7.00 గం.లకు అంతరాలయం లో స్వామి వారి కళ్యాణం గావించుకొని అనంతరం 10.30 నిలకు తిరు కళ్యాణ మహోత్సవం అశేష భక్త మహశయుల రామ నామ స్మరణతో అంగ రంగ వైభవంగా కళ్యాణం జరిగింది.ఈ వేడుకలో పాల్వంచ పరిసర ప్రాంతాల నుంచి దాదాపు ఏడువేల మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించి, స్వామి వారి సేవలో పునీతులు అయ్యారు.సాయంత్రం 7.00 గం,లకు శ్రీ హనుమ సేవ ఆధ్వర్యంలో స్వామి వారి శోభాయాత్ర బైక్ ర్యాలీ గా పాల్వంచ పురవీధుల్లో రామ నామ స్మరణతో నడిచింది.ఈ శోభాయాత్ర ప్రారంభం నుంచి చివరి వరకు ఒక్కసారి గా పాల్వంచ పట్టనం మొత్తం ఆధ్యాత్మిక చింతనతో కొనియాడినది.స్వామి వారి కళ్యాణ మహోత్సవానికి సహకరించిన దాతలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మీకు మీ కుటుంబ సభ్యులకు ఆ దేవ దేవుని ఆశీస్సులు ఎల్ల వేళలా ఉండాలని కోరుకుంటూ.. సర్వే జనా సుఖినోభవంతు.
Admin
తెలుగు వెలుగు టీవీ