తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం జనవరి 31 తెలుగు వెలుగు ) : జూలూరుపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు మండల స్థాయి సీఎం కప్ పోటీలను ప్రారంభించుటకు ముఖ్యఅతిథిగా మండల అభివృద్ధి అధికారి పి అజయ్ కుమార్ , తాసిల్దార్ టి శ్రీనివాసరావు , మండల సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీలక్ష్మి , మరియు మండల విద్యాశాఖ అధికారి బి. జుంకీలాల్ , స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు టి.లక్ష్మీనరసయ్య , ఈ ఆటల పోటీలను ఘనంగా ప్రారంభించడం జరిగింది. 18 సంవత్సరాలు పైబడిన పురుషులు మరియు మహిళలు కబడ్డీ కోకో వాలీబాల్ పోటీల్లో పాల్గొనడం జరిగింది అలాగే జూనియర్ విభాగంలో 18 సంవత్సరాల లోపు విద్యార్థులు కోకో కబడ్డీ వాలీబాల్ ఆటలను నిర్వహించడం జరిగింది. ఈ పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులు ప్రధానం చేయడం జరిగింది. కబడ్డీ పురుషుల విభాగంలో ప్రథమ స్థానం పాపకల్లు క్లస్టర్, కోకో జూలూరుపాడు క్లాస్టర్ వాలీబాల్ కస్టర్ విజేతలుగా నిలిచారు. మహిళ విభాగంలో కబడ్డీ జూలూరుపాడు క్లస్టర్ కోకోలో జూలూరుపాడు క్లస్టర్, వాలీబాల్ పాపికొల్లు క్లస్టర్ విభాగంలో జూలూరుపాడు క్లస్టర్ విజేతలుగా నిలిచారు. అండర్ 18 బాలుర విభాగములొ జూలూరుపాడు క్లస్టర్ కోకో జూలూరుపాడు క్లస్టర్ , వాలీబాల్ పాపకొల్లు క్లస్టర్ విజేతలుగా నిలిచారు. అండర్ 18 బాలికల విభాగం లో కబడ్డీ జూలూరుపాడు క్లస్టర్, కోకో జూలూరుపాడు క్లస్టర్, వాలీబాల్ జూలూరుపాడు క్లస్టర్ విజేతలుగా నిలిచారు. మహిళల మరియు పురుషుల విభాగంలో వారికి మండల స్థాయిలో క్రీడలు నిర్వహించడం జరిగింది. మహిళలకు పురుషులకు మండల స్థాయిలో మాత్రమే క్రీడలు నిర్వహించబడ్డాయి. వీరికి పై స్థాయిలో ఉండవు. అండర్ 18 బాలబాలికలకు మండల స్థాయి అసెంబ్లీ స్థాయి జిల్లాస్థాయి మరియు రాష్ట్రస్థాయి లో నిర్వహించబడతాయి అని పాఠశాల ప్రధానోపాధ్యాయులు టి. లక్ష్మి నరసయ్య తెలియజేశారు
Admin
తెలుగు వెలుగు టీవీ