తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే చుంచుపల్లి బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ రుద్రంపూర్ గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థి గుమ్మడి దివ్యను గెలిపించాలని కొత్తగూడెం మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి పిలుపునిచ్చారు. గురువారం రుద్రంపూర్ గ్రామపంచాయతీలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ప్రచారం చేపట్టారు. టిఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి గుమ్మడి దివ్య కత్తెర గుర్తుపై ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పదేళ్లపాటు కేసీఆర్ అందించిన అభివృద్ధి సంక్షేమ ఫలాలను ప్రజలకు వివరించారు. కేసీఆర్ పాలనతోనే తెలంగాణ సమగ్ర అభివృద్ధి సాధిస్తుందని చెప్పారు. కెసిఆర్ హయాంలో పల్లెలు పచ్చగా వెలిగాయని, రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైందని తెలిపారు. 6 గ్యారంటీలు, 420 హామీలిచ్చి తెలంగాణ ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని కోరారు. ఈ ప్రచారంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు యాకయ్య, మాజీ కౌన్సిలర్ ప్రసాద్, మాజీ సర్పంచ్ గుమ్మడి సాగర్, నాయకులు మునీర్, శేఖర్, షరీఫ్, శంకర్, షణ్ముఖ సాయి కార్యకర్తలు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ