తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం అక్టోబర్ 21 (తెలుగు వెలుగు) జూలూరుపాడు లో బిజెపి మండల సమావేశంలో బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి చిలుకూరి రమేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో హామీలు ఇచ్చి ఎన్నికల్లో గెలుపొంది, పూటకు ఒక్క మాట చెబుతూ ప్రజలను మోసం చేస్తున్నది, రుణమాఫీ కావలసిన రైతులు 64 లక్షల మంది రైతులు ఉంటే 42 లక్షల రైతులకి మాత్రమే రుణమాఫీ చేస్తాం 31 వేల కోట్ల రూపాయలతో ఆగస్టు 15 లోపు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇచ్చింది వారు మాటిచ్చిన వరికైనా మాఫీ చేశారా చేయలేదు, రైతుకు పెట్టుబడి సాయం ఎకరానికి 15000 రూపాయలు రెండు పంటలకు ఇస్తామని హామీ ఇచ్చారు ఖరీఫ్ పంట కాలం అయిపోయినది ఇప్పుడైనా సరే పెట్టుబడి సాయం ఇస్తారని రైతులు ఎదురుచూస్తున్నారు కానీ ప్రభుత్వం ఈ సీజను ఇవ్వలేము అని చెప్పటం రైతులను మోసం చేయడమే , మహిళలకు నెలకు ₹2,500 పెన్షన్ ఇస్తామని, వృద్ధులకు ఇంట్లో ఎంతమంది వృద్ధులు ఉంటే అంతమందికి నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామని, నిరుద్యోగులకు నాలుగు వేలు నిరుద్యోగ భృతి ఇస్తామని, దళితులకు 12 లక్షల రూపాయలు ఇస్తామని, గిరిజనులకు 10 లక్షల రూపాయలు ఇస్తామని సాధ్యం కానీ హామీలను ఇచ్చి ప్రజలందరినీ కూడా మోసం చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినది, గత ప్రభుత్వం రుణమాఫీ చేస్తానని చెప్పి మాఫీ చెయ్యకపోవటం వల్ల ప్రజలు గద్దె దింపారు, కాంగ్రెస్ పార్టీకి కూడా ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఏర్పడింది మీ ఎమ్మెల్యేలే మీ ప్రభుత్వాన్ని వ్యతిరేకించి రోజు వస్తున్నది ,ఎందుకంటే ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది, కాబట్టి టిఆర్ఎస్ ప్రభుత్వం కూడా పేద ప్రజలకు ఇల్లు ఇవ్వకుండా పది సంవత్సరాలు ప్రజలను మోసం చేసింది, కేంద్ర ప్రభుత్వం ఎంతమంది నిరుపేదలకు ఇల్లు కావాలన్నా ఇస్తామని చెబుతున్న కూడా ఉపయోగించుకోలేదు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా నియోజకవర్గానికి 3,000 ఇల్లు ఇస్తామంటున్నారు, అంటే ఒక మండలానికి 500 ఇల్లు మాత్రమే వస్తున్నాయి ఒక మండలంలో వేల మందికి ఇల్లు కావాలి. కానీ కేవలం కొంతమందికే ఇల్లు ఇస్తామంటే కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల్ని మోసం చేస్తున్నారు, కేంద్ర ప్రభుత్వం పేదలకు ఎన్ని ఇల్లు కావాలన్నా అర్హత ఉన్న అందరికీ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది, కానీ దాన్ని ఉపయోగించుకోకుండా కొంతమందికే ఇల్లు ఇస్తామని ఇందిరమ్మ కమిటీల పేరుతో పేదలని ఇబ్బంది పెడితే గత ప్రభుత్వానికి పట్టిన గతే కాంగ్రెస్ పార్టీకి కూడా పట్టింది ,కావున కాంగ్రెస్ పార్టీ మీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేయాలని భారతీయ జనతా పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీని బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి చిలుకూరి రమేష్ డిమాండ్ చేశారు .ఈకార్యక్రమంలో కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు మాదినేని సతీష్ ,బిజెపి మండల అధ్యక్షుడు సిరిపురపు ప్రసాద్ ,బిజెపి మండల కార్యదర్శి భూక్య రమేష్ ,కిసాన్ మోర్చా మండల ప్రధాన కార్యదర్శి సిరుపరపు పుల్లారావు ,గోపాల్ రావు ,నర్వనేని కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ