తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రైతులు ఎల్నినో ప్రభావం కారణంగా వర్షపాతం పంపిణీలో మార్పులు సంభవించే అవకాశం ఉన్నందున వ్యవసాయ కార్యకలాపాలను జాగ్రత్తగా నిర్వహించాలని వ్యవసాయ శాఖ అధికారి బాబురావు ఒక ప్రకటనలో తెలిపారు. ఎల్నినో ప్రభావంతో సాధారణం కంటే తక్కువ వర్షపాతం లేదా వర్షాలలో అంతరాలు ఏర్పడే అవకాశం ఉన్నందున రైతులు వాతావరణ పరిస్థితులను గమనిస్తూ పంటల ఎంపిక చేసుకోవాలని సూచించారు. భూమిలో తగినంత తేమ ఏర్పడిన తర్వాత మాత్రమే విత్తనాలు విత్తాలని, తేమ లేకుండా విత్తనాలు వేయడం వల్ల మొలక శాతం తగ్గి రైతులకు నష్టం కలిగే అవకాశం ఉందన్నారు. వర్షాల ఆలస్యం లేదా తక్కువ వర్షపాతం పరిస్థితులు కొనసాగితే రైతులు తక్కువ కాలవ్యవధిలో పూర్తయ్యే, తక్కువ నీటి అవసరం ఉన్న ప్రత్యామ్నాయ పంటలైన కంది, పెసర, మినుము, జొన్న, సజ్జ, కొర్రలు, సామలు వంటి పంటల సాగును పరిశీలించాలని సూచించారు. ధృవీకరించిన నాణ్యమైన విత్తనాలను మాత్రమే వినియోగించాలని, విత్తన శుద్ధి చేపట్టాలని, పొలాల్లో తేమ సంరక్షణ చర్యలు పాటించాలని తెలిపారు. రైతులు వ్యవసాయ శాఖ అధికారులు, కృషి విజ్ఞాన కేంద్రాలు మరియు వాతావరణ శాఖ సూచనలను అనుసరిస్తూ పంటల సాగు ప్రణాళిక రూపొందించుకోవాలని వ్యవసాయ శాఖ అధికారి బాబురావు తెలిపారు .
Admin
తెలుగు వెలుగు టీవీ