Sunday, 02 August 2026 06:56:44 AM
# సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్: ₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం. # ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో స్కార్ఫ్ డే # సుజాత నగర్, బాలాజి నగర్ ల్లో వీధి కుక్కల బెడత. # జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకోండి – పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించండి. # నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ & పీఎం) కిరణ్ కుమార్‌కు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు. # భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు, ERO రవికుమార్. # 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం. # ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు, బిఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి . # 50 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్. # సారపాక,రెడ్డిపాలెం, తూర్పాక,దుమ్ముగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # తాటి సురేష్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా, కోమరి కృష్ణ సన్మానం. # భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మేరా యువ భారత్, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఘనంగా ముగిసిన 8 రకాల జిల్లాస్థాయి పోటీలు. # ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం. # గోదావరి వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # 16వ డివిజన్లో నూతన కాలువ నిర్మాణ పనులు ప్రారంభం.కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘన సన్మానం. # కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై సమరశంఖం పూరించాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

వర్షాకాలంలో వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి : Dr తుకారాం రాథోడ్ DMHO

Date : 16 June 2026 04:35 PM Views : 62

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : వైద్యాధికారులు మరియు ఎం ఎల్ హెచ్ పి లతోసమీక్ష సమావేశం లో Dr తుకారాం రాథోడ్ DMHO ఆరోగ్య సేవల నాణ్యత పెంపు, మాతా-శిశు ఆరోగ్యం, సాధారణ ప్రసవాలు మరియు వ్యాధుల నివారణపై ప్రత్యేక దృష్టి పెట్టాలి – డా. తుకారాం రాథోడ్, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా. తుకారాం రాథోడ్ అధ్యక్షతన వైద్య అధికారుల సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డా. తుకారాం రాథోడ్ మాట్లాడుతూ ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సేవలు అందించడం ప్రతి వైద్య అధికారి ప్రధాన బాధ్యత అని తెలిపారు. ప్రభుత్వ ఆరోగ్య కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేసి ప్రజల ఆరోగ్య సూచికలను మెరుగుపరచేందుకు కృషి చేయాలని సూచించారు. సమావేశంలో క్రింది అంశాలపై సమీక్ష నిర్వహించారు: గర్భిణీ స్త్రీలకు నాణ్యమైన గర్భధారణ పూర్వ సేవలు అందించాలి. అధిక ప్రమాద గర్భిణీలను (High Risk ANC) గుర్తించి నిరంతర పర్యవేక్షణ చేయాలి. సాధారణ ప్రసవాల శాతాన్ని పెంచేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలి. మాతృ మరణాలు (MMR) మరియు శిశు మరణాలు (IMR) తగ్గించేందుకు ప్రత్యేక ప్రణాళికలు అమలు చేయాలి. తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించి జననం తర్వాత వెంటనే తల్లిపాలు ఇవ్వడాన్ని ప్రోత్సహించాలి. రక్తహీనత (Anemia) నివారణకు చర్యలు చేపట్టాలి. సికిల్ సెల్ అనీమియా స్క్రీనింగ్ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలి. జీవనశైలి వ్యాధులు అయిన మధుమేహం, రక్తపోటు, ఊబకాయం నియంత్రణకు స్క్రీనింగ్ కార్యక్రమాలు చేపట్టాలి. క్షయవ్యాధి (TB), కుష్ఠు వ్యాధి, డెంగ్యూ, మలేరియా తదితర వ్యాధుల నివారణకు చర్యలు చేపట్టాలి. ప్రతి శుక్రవారం డ్రై డే నిర్వహించి దోమల నివారణ చర్యలను కట్టుదిట్టం చేయాలి. యాంటీ లార్వల్ ఆపరేషన్లు నిర్వహించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి. పాఠశాలలు, కళాశాలలు, హాస్టళ్లలో ఆరోగ్య శిబిరాలు నిర్వహించాలి. HPV టీకా, పల్స్ పోలియో, స్టాప్ డయేరియా కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేయాలి. సమతుల ఆహారం, శారీరక వ్యాయామం, యోగా వంటి ఆరోగ్యకర జీవనశైలిని ప్రోత్సహించాలి. ఆరోగ్య కేంద్రాల్లో రికార్డులు, రిజిస్టర్లు మరియు నివేదికలను సక్రమంగా నిర్వహించాలి. ప్రజలకు ఆరోగ్య విద్య అందించేందుకు IEC, BCC కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలి. అత్యవసర వైద్య సేవలు అందించేందుకు అన్ని ఆరోగ్య కేంద్రాలు సిద్ధంగా ఉండాలని సూచించారు. అదేవిధంగా, వైద్య అధికారులు తమ పరిధిలోని గ్రామాలను తరచుగా సందర్శించి ఆరోగ్య కార్యక్రమాల అమలును పర్యవేక్షించాలని, విధుల పట్ల నిర్లక్ష్యం వహించకుండా ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. అదేవిధంగా జిల్లాలోని యూనియన్ నాయకులతో సమావేశం నిర్వహించి సిబ్బంది తక్కువగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో భర్తీపై ప్రణాళికను తయారు చేయుట కొరకు గతంలో జనరల్ ట్రాన్స్ఫర్లలో సబ్ సెంటర్లు ఇవ్వని 54 మంది ఏఎన్ఎంలకు ఈనెల 18వ తారీకున కమిషనర్ గారి ఆదేశానుసారం డిప్యూటీ డిఎంహెచ్ఓ ఆఫీస్, కొత్తగూడెం నందు కౌన్సిలింగ్ నిర్వహించబడును అని తెలియజేశారు ఈ సమావేశంలో Dr శ్రీధర్ Dy DMHO Dr సాయి కళ్యాణ్ డిప్యూటీ డిఎంహెచ్ఓ, Dr ప్రసాద్ ప్రోగ్రాం ఆఫీసర్లు Dr ప్రతాప్ , Dr రాందాస్ , Dr రాకేష్ , Dr దినేష్ dr. హరీష్, వైద్యాధికారులు, ఎం ఎల్ హెచ్ పీ లు మరియు యూనియన్ నాయకులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :