Monday, 03 August 2026 08:18:35 AM
# సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్: ₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం. # ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో స్కార్ఫ్ డే # సుజాత నగర్, బాలాజి నగర్ ల్లో వీధి కుక్కల బెడత. # జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకోండి – పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించండి. # నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ & పీఎం) కిరణ్ కుమార్‌కు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు. # భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు, ERO రవికుమార్. # 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం. # ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు, బిఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి . # 50 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్. # సారపాక,రెడ్డిపాలెం, తూర్పాక,దుమ్ముగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # తాటి సురేష్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా, కోమరి కృష్ణ సన్మానం. # భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మేరా యువ భారత్, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఘనంగా ముగిసిన 8 రకాల జిల్లాస్థాయి పోటీలు. # ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం. # గోదావరి వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # 16వ డివిజన్లో నూతన కాలువ నిర్మాణ పనులు ప్రారంభం.కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘన సన్మానం. # కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై సమరశంఖం పూరించాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

మార్కోడు ఆశ్రమ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్

Date : 22 January 2026 08:26 PM Views : 232

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : మార్కోడు గ్రామంలోని ఆశ్రమ పాఠశాలను జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణం, తరగతి గదులు, హాస్టల్ గదులు, మరుగుదొడ్లు, డైనింగ్ హాల్ తదితర మౌలిక వసతులను కలెక్టర్ నిశితంగా పరిశీలించారు.మరుగుదొడ్ల పరిశీలన సమయంలో నీటి సరఫరా సక్రమంగా లేకపోవడాన్ని గమనించిన కలెక్టర్, తక్షణమే చర్యలు తీసుకొని నిరంతర నీటి సరఫరా కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వర్షాకాలంలో పాఠశాల భవనంలో లికేజీ సమస్య ఉన్నట్లు ఉపాధ్యాయులు కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లగా, అవసరమైన మరమ్మత్తులను వెంటనే చేపట్టాలని సంబంధిత శాఖల అధికారులకు సూచించారు.డైనింగ్ హాల్‌ను పరిశీలించిన కలెక్టర్, స్టాక్ రిజిస్టర్లు, వంట నిర్వహణ విధానాన్ని తనిఖీ చేశారు. పిల్లలకు శుభ్రమైన, పోషకాహారంతో కూడిన రుచికరమైన భోజనం తప్పనిసరిగా అందించాలని, వంట సిబ్బంది పరిశుభ్రత నిబంధనలను కచ్చితంగా పాటించాలని ఆదేశించారు. ప్రతి విద్యార్థికి వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించాలని తెలిపారు. ఈ విషయంలో ఎలాంటి లోటుపాట్లు తలెత్తినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పాఠశాలలో కిచెన్ షెడ్ నిర్మాణానికి అవసరమైన నివేదికలను వెంటనే సమర్పించాలని అధికారులను ఆదేశించారు. వంటకట్టెలపై ఆధారపడుతున్న పరిస్థితిని గమనించిన కలెక్టర్, గ్యాస్ సరఫరా ఏర్పాట్లకు తగిన చర్యలు చేపట్టాలని సూచించారు.అనంతరం మూడవ, ఆరవ, ఎనిమిదవ తరగతుల గదులను కలెక్టర్ పరిశీలించి విద్యార్థులతో మమేకమయ్యారు. విద్యార్థులతో మాట్లాడి వారికి అందుతున్న సదుపాయాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని వాటిని సాధించే దిశగా కృషి చేయాలని సూచించారు. విద్యను అభ్యసించడంలో శ్రద్ధ చూపాలని, జీవిత లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకొని సమయాన్ని వృథా చేయకుండా చదువుపై పూర్తి దృష్టి సారించాలని తెలిపారు. విద్యార్థుల చదవడం, రాయడం నైపుణ్యాలను పరిశీలిస్తూ బోర్డుపై రాయించి, పుస్తకాలు చదివించి వారి అభ్యాస స్థాయిని పరీక్షించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులకు సురక్షిత వాతావరణంతో పాటు మెరుగైన మౌలిక వసతులు, నాణ్యమైన విద్య, పోషకాహారం తప్పనిసరిగా అందాలని తెలిపారు. పాఠశాలల నిర్వహణలో ఎక్కడా నిర్లక్ష్యం వహించరాదని, చిన్న లోపం కూడా విద్యార్థుల ఆరోగ్యం మరియు భవిష్యత్తుపై ప్రభావం చూపుతుందని అన్నారు. మరుగుదొడ్లు, నీటి సరఫరా, హాస్టల్ వసతులు ఎల్లప్పుడూ సక్రమంగా ఉండేలా అధికారులు నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు.అనంతరం మార్కోడు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. పాఠశాల ఆవరణలో నిర్మిస్తున్న కొత్త తరగతి గదులు, కిచెన్ షెడ్, కాంపౌండ్ వాల్, మరుగుదొడ్ల నిర్మాణాలను పరిశీలించి, పది రోజుల్లోగా అన్ని పనులను పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. పనులు నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా చేపట్టాలని, ఎలాంటి లోపాలు తలెత్తినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కొత్తగా చేపడుతున్న నిర్మాణాలకు అవసరమైన విద్యుతీకరణ పనులను కూడా త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.ఈ పర్యటనలో కలెక్టర్ వెంట ప్రధానోపాధ్యాయులు ముత్తయ్య, రామకృష్ణ, బోధన, బోధనీ తర సిబ్బంది సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :