Sunday, 07 June 2026 08:47:02 AM
# బిజెపి పార్టీ సీనియర్ నాయకులు సొప్పరి క్రాంతి ఆధ్వర్యంలో గౌతంపూర్ లో మొక్కలు నాటడం జరిగినది. # ఈ నెల 7, 8 తేదీల్లో రెండు రోజులపాటు ఎఐటీయూసీ సెంట్రల్ కౌన్సిల్ సమావేశం. సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఎఐటియుసి. # మున్సిపల్ కార్పొరేషన్‌లో సిపిఐ పక్ష బలాన్ని సమర్థవంతంగా చాటాలి.కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు # నామా వినోద్‌పై దాడి చేసిన భూకబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. # మీసేవ దరఖాస్తుల పరిశీలన పూర్తిగా ఆన్‌లైన్‌లోనే. జీపీఓలు, ఆర్‌ఐలకు అవగాహన కల్పించిన ఈ-డిస్ట్రిక్ట్ మేనేజర్ సైదేశ్వరరావు. # ప్రజల ప్రాణ రక్షణకు ముందస్తు చర్యలు చేపట్టాలి. గోదావరి వరదల పట్ల అప్రమత్తంగా ఉండాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మరో రెండు రోజుల్లో రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకనున్న నేపథ్యంలో జిల్లాలో వరి కొనుగోలు ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలి. # భద్రాచలం టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అయ్యప్ప కాలనీ, రెవిన్యూ కాలనీల్లో కార్డాన్ అండ్ సెర్చ్ ఆపరేషన్. # విద్యార్థులు సాంస్కృతిక పోటీల్లో రాణించాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # పెట్రోలింగ్,బ్లూ కోల్డ్స్ వాహనాలతో సంచరిస్తూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలి. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మాస్టర్ ఈ .కె ఆధ్యాత్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో కాకర్ల గ్రామం నందు ఉచిత హోమియో వైద్య శిబిరం. # భూభారతి, సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సెంట్రల్ పార్కులో ప్లాస్టిక్ ఏరివేత -మొక్కలు నాటిన ఎస్ జి ఎఫ్. # కొత్తగూడెం ఇల్లందు రహదారిపై స్కూటీని ఢీకొన్న లారీ. # పరిశ్రమల అభివృద్ధికి అధికారులు మార్గదర్శకులుగా వ్యవహరించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ధరల పెరుగుదలపై రాజీలేని పోరాటం చేద్దాం.సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # గోపన్నగూడెంలో మినీ మేడారం జాతరలో పాల్గొన్న ఎమ్మెల్యే జారె. # జనగణన జాబితా వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించేలా ఉండాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # సమున్నత ఆశయాలతోనే భారత జాతీయ మహిళా సమాఖ్య ఆవిర్భావం. భారత జాతీయ మహిళా సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి మున్నా లక్ష్మీకుమారి. # ప్రజా సమస్యల పరిష్కార మార్గాన్ని చూపే విధంగా గ్రామ సభలు ఉండాలి. 16వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ.

మార్కోడు ఆశ్రమ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్

Date : 22 January 2026 08:26 PM Views : 210

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : మార్కోడు గ్రామంలోని ఆశ్రమ పాఠశాలను జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణం, తరగతి గదులు, హాస్టల్ గదులు, మరుగుదొడ్లు, డైనింగ్ హాల్ తదితర మౌలిక వసతులను కలెక్టర్ నిశితంగా పరిశీలించారు.మరుగుదొడ్ల పరిశీలన సమయంలో నీటి సరఫరా సక్రమంగా లేకపోవడాన్ని గమనించిన కలెక్టర్, తక్షణమే చర్యలు తీసుకొని నిరంతర నీటి సరఫరా కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వర్షాకాలంలో పాఠశాల భవనంలో లికేజీ సమస్య ఉన్నట్లు ఉపాధ్యాయులు కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లగా, అవసరమైన మరమ్మత్తులను వెంటనే చేపట్టాలని సంబంధిత శాఖల అధికారులకు సూచించారు.డైనింగ్ హాల్‌ను పరిశీలించిన కలెక్టర్, స్టాక్ రిజిస్టర్లు, వంట నిర్వహణ విధానాన్ని తనిఖీ చేశారు. పిల్లలకు శుభ్రమైన, పోషకాహారంతో కూడిన రుచికరమైన భోజనం తప్పనిసరిగా అందించాలని, వంట సిబ్బంది పరిశుభ్రత నిబంధనలను కచ్చితంగా పాటించాలని ఆదేశించారు. ప్రతి విద్యార్థికి వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించాలని తెలిపారు. ఈ విషయంలో ఎలాంటి లోటుపాట్లు తలెత్తినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పాఠశాలలో కిచెన్ షెడ్ నిర్మాణానికి అవసరమైన నివేదికలను వెంటనే సమర్పించాలని అధికారులను ఆదేశించారు. వంటకట్టెలపై ఆధారపడుతున్న పరిస్థితిని గమనించిన కలెక్టర్, గ్యాస్ సరఫరా ఏర్పాట్లకు తగిన చర్యలు చేపట్టాలని సూచించారు.అనంతరం మూడవ, ఆరవ, ఎనిమిదవ తరగతుల గదులను కలెక్టర్ పరిశీలించి విద్యార్థులతో మమేకమయ్యారు. విద్యార్థులతో మాట్లాడి వారికి అందుతున్న సదుపాయాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని వాటిని సాధించే దిశగా కృషి చేయాలని సూచించారు. విద్యను అభ్యసించడంలో శ్రద్ధ చూపాలని, జీవిత లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకొని సమయాన్ని వృథా చేయకుండా చదువుపై పూర్తి దృష్టి సారించాలని తెలిపారు. విద్యార్థుల చదవడం, రాయడం నైపుణ్యాలను పరిశీలిస్తూ బోర్డుపై రాయించి, పుస్తకాలు చదివించి వారి అభ్యాస స్థాయిని పరీక్షించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులకు సురక్షిత వాతావరణంతో పాటు మెరుగైన మౌలిక వసతులు, నాణ్యమైన విద్య, పోషకాహారం తప్పనిసరిగా అందాలని తెలిపారు. పాఠశాలల నిర్వహణలో ఎక్కడా నిర్లక్ష్యం వహించరాదని, చిన్న లోపం కూడా విద్యార్థుల ఆరోగ్యం మరియు భవిష్యత్తుపై ప్రభావం చూపుతుందని అన్నారు. మరుగుదొడ్లు, నీటి సరఫరా, హాస్టల్ వసతులు ఎల్లప్పుడూ సక్రమంగా ఉండేలా అధికారులు నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు.అనంతరం మార్కోడు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. పాఠశాల ఆవరణలో నిర్మిస్తున్న కొత్త తరగతి గదులు, కిచెన్ షెడ్, కాంపౌండ్ వాల్, మరుగుదొడ్ల నిర్మాణాలను పరిశీలించి, పది రోజుల్లోగా అన్ని పనులను పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. పనులు నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా చేపట్టాలని, ఎలాంటి లోపాలు తలెత్తినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కొత్తగా చేపడుతున్న నిర్మాణాలకు అవసరమైన విద్యుతీకరణ పనులను కూడా త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.ఈ పర్యటనలో కలెక్టర్ వెంట ప్రధానోపాధ్యాయులు ముత్తయ్య, రామకృష్ణ, బోధన, బోధనీ తర సిబ్బంది సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :