తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి ఈ రోజు PHC Regalla పరిధిలోని Laxmidevipally Mandal లోని AAM Center Chathakonda ను, తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హెల్త్ & వెల్నెస్ కార్యకలాపాలు మరియు వివిధ జాతీయ ఆరోగ్య కార్యక్రమాలకు సంబంధించిన రికార్డులను సమగ్రంగా పరిశీలించారు.సిబ్బందికి NCD స్క్రీనింగ్ను మరింత బలోపేతం చేయాలని, గర్భిణీల ANC నమోదు శాతం పెంచాలని, పాఠశాలలలో ఆరోగ్య విద్య కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించాలని, అలాగే పోషకాహార లోపంతో బాధపడుతున్న SAM మరియు MAM పిల్లల గుర్తింపు మరియు స్క్రీనింగ్ను క్రమం తప్పకుండా చేపట్టాలని సూచించారు.అనంతరం DM&HO Siddhartha Nursing College ను, Kothagudem లో సందర్శించి నర్సింగ్ విద్యార్థుల కాపింగ్ మరియు లైటింగ్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నర్సింగ్ విద్యార్థులు సేవాభావంతో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని ఆకాంక్షించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ