Thursday, 17 September 2026 06:09:35 PM
# జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్.

కమాండ్ కంట్రోల్ సెంటర్ లో అన్ని జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్

Date : 12 August 2025 08:27 PM Views : 492

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కమాండ్ కంట్రోల్ సెంటర్ లో అన్ని జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్… దమ్మపేట నుండి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాల నేపథ్యంలో ముందస్తు చర్యలపై చర్చ. హైదరాబాద్ః రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో గౌరవ ముఖ్యమంత్రి ముందస్తుగా తీసుకోవల్సిన చర్యలపై అన్ని జిల్లాలల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో కమాండ్ కంట్రోల్ సెంటర్లో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. రానున్న మూడు రోజులు భారీ వర్షాలు పడే అవకాశం ఉన్న అవకాశం ఉన్నందున రైతులు అప్రమత్తంగా ఉండేలా ముందస్తుగా తెలియజేయాలని వ్యవసాయశాఖ మంత్రికి సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో రైతులకు, పంటలకు వచ్చిన ముప్పేమి లేదని, ఒకవేళ భారీగా వర్షాలు పడితే ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా మంత్రి ముఖ్యమంత్రిగారికి తెలిపారు. దూర ప్రయాణాలు మానుకోవాలని ప్రజలకు సూచించారు. ఈ సందర్భంగా యూరియాపై ముఖ్యమంత్రి అడగగా.. నిన్నటి నుంచి మాత్రమే మనకి రామగుండం నుండి యూరియా సరఫరా మొదలైందని, రోజుకు ఒక rake యూరియా సప్లై చేస్తున్నారని, దానిని డిమాండ్ ఉన్న జిల్లాలకు పంపించడం జరుగుతుందని అన్నారు. ఇప్పటికే తాను 4 సార్లు, స్వయంగా ముఖ్యమంత్రి 4 సార్లు కేంద్ర ఎరువులు, రసాయనలు శాఖ మంత్రి నడ్డాగారిని కోరిన, కేంద్రం నుండి ఎలాంటి రెస్పాన్స్ లేదని, 4 నెలల నుండి వారు కేటాయించిన విధంగా ఎప్పుడూ పూర్తిగా సరఫరా చేయలేదని, మన దగ్గర ఉన్న బఫర్ స్టాక్ తోనే ఇప్పటివరకు సర్ధుబాటు చేయడం జరిగిందని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ నెలలో యూరియా వాడకం ఎక్కువగా ఉంటుందని, వరి నాట్లు కూడా 15 వరకు అయిపోతాయని, యూరియా ధరలు తక్కువగా ఉండటం వలన కూడా ఎక్కువగా అమ్మకాలు జరుగుతున్నాయని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటికే యూరియా కొరత ఉందని, కేంద్రం నుండి అవసరం మేరకు యూరియా రాకుంటే ఇబ్బందులు తలెత్తుతాయని అన్నారు. ఢిల్లీలోని మన రాష్ట్ర ఎంపీలను కేంద్ర మంత్రి జెపి నడ్డా గారిని కలిసి మరోసారి రాష్ట్రానికి రావాల్సిన యూరియా గురించి అడిగేవిధంగా సూచించాలని ముఖ్యమంత్రిగారిని ఈ సందర్భంగా మంత్రి కోరడం జరిగింది.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :