తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం ఏరియా కార్పొరేట్ ఏరియా టీబీజీకేఎస్ యూనియన్ కార్యాలయం వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించిన కాపుకృష్ణ రాష్ట్ర జనరల్ సెక్రెటరీ టీబీజీకేఎస్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ స్వాతంత్య్రం కోసం తమ ప్రాణాలను సైతం త్యాగం చేసిన ఎందరో మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ... భిన్నత్వంలో ఏకత్వాన్ని కాపాడుతూ, పరస్పర గౌరవం, దేశభక్తి విలువలను పెంపొందిస్తూ అసమానతలు లేని శాంతి, సౌభ్రాతృత్వాలతో కూడిన బలమైన ప్రజాస్వామిక భారతదేశ నిర్మాణమే ఆ సమరయోధుల త్యాగాలకు నిజమైన నివాళి అని పేర్కొన్నారు. పౌరులందరికీ సమన్యాయం, సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వంతో 80వ స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకుంటున్న ఈ శుభసందర్భంగా... నవ భారత నిర్మాణం కోసం ప్రతి పౌరుడు కర్తవ్యనిష్ఠతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. దేశ పురోగతిలో సింగరేణి ఉద్యోగుల కృషి ఎంతో ఉన్నదని ఆయన కొనియాడారు ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్లు గడప రాజయ్య, తుమ్మ శ్రీనివాస్ టీబీజీకేఎస్ సెంట్రల్ కమిటీ సభ్యులు కంచర్ల శ్రీనివాస్ ప్రసాద్ ఎంటెక్ మహేందర్ ఏరియా కమిటీ నాయకులు విద్యాసాగర్, రాజకుమార్, రాములు సూరిబాబు, అమర్, బాబు జాన్, పాషా,పిట్ కార్యదర్శులు వెంకటేశ్వర్లు రాంబాబు రాజేష్ దేవ సింగ్ నాయకులు బిఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ