Thursday, 17 September 2026 02:16:21 PM
# జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్.

బక్కచింతలపాడు గ్రామంలో చర్ల పోలీసుల ఆధ్వర్యంలో నిర్మించిన నూతన మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ప్రారంభించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్

Date : 22 July 2026 05:17 PM Views : 115

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం బక్కచింతలపాడు గ్రామంలో చర్ల పోలీసుల ఆధ్వర్యంలో నిర్మించిన నూతన మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల భవనాన్ని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ ప్రారంభించారు. పాఠశాలలోని విద్యార్థిని,విద్యార్థులకు స్కూల్ బ్యాగులను, పలకలను పంపిణీ చేయడం జరిగింది. అనంతరం విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రామస్తులతో సమావేశమై పలు అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ విద్య అనేది ప్రతి చిన్నారి భవిష్యత్తుకు బలమైన పునాది అని పేర్కొన్నారు. మారుమూల గిరిజన ప్రాంతాల్లోని చిన్నారులు కూడా నాణ్యమైన విద్యను అభ్యసించి ఉన్నత లక్ష్యాలను సాధించేలా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. పాఠశాలలో పరిశుభ్రమైన వాతావరణం, క్రమశిక్షణ, విద్యార్థుల నైతిక విలువలు, హాజరు శాతం పెంపు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఉపాధ్యాయులకు సూచించారు. ప్రతి విద్యార్థి ప్రతిభను గుర్తించి వారికి తగిన ప్రోత్సాహం అందించాలని తెలిపారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడలు, యోగా, సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని, వీటి ద్వారా ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు, జట్టు భావన పెంపొందుతాయని చెప్పారు. అనారోగ్యం, ప్రమాదాలు లేదా ఇతర సమస్యలు ఎదురైనప్పుడు మూఢనమ్మకాలను నమ్మకుండా వెంటనే ప్రభుత్వ ఆసుపత్రులను సంప్రదించాలని తెలిపారు. ఆరోగ్య సమస్యలకు వైద్య చికిత్సే సరైన మార్గమని వివరించారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇళ్ల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని గ్రామస్తులకు సూచనలు చేశారు. డెంగీ, మలేరియా వంటి వర్షాకాల వ్యాధుల లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలను సంప్రదించాలని తెలిపారు. గ్రామాల్లో నిర్వహించే వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని, పిల్లలకు అవసరమైన టీకాలు పూర్తిగా వేయించాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. రోడ్డు భద్రతపై అవగాహన కలిగి ఉండాలని సూచనలు చేశారు. అనంతరం వన మహోత్సవంలో భాగంగా పాఠశాల ఆవరణలో అధికారులతో కలిసి మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం డిఎస్పి అరుణ్ కుమార్, ఎస్బి 2 ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, చర్ల సీఐ రాజు వర్మ, ఎస్సైలు నర్సిరెడ్డి, కేశవ, యంఈఓ రమణ, కాంట్రాక్టర్ సంతోష్, సర్పంచ్ లక్ష్మి, ఉపాధ్యాయురాలు సౌజన్య, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :