Thursday, 02 July 2026 04:27:48 AM
# సింగరేణి గడ్డ మరోసారి పోరాటాల గడ్డగా మారింది. జేఏసీ ఆధ్వర్యంలో కొత్తగూడెం హెడ్ ఆఫీస్ ముట్టడి విజయవంతం.వేలాది కార్మికులతో మార్మోగిన డిమాండ్ల డే. # నేషనల్ హైవే అధికారుల నిర్లక్ష్యం తగదు.కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # కల్యాణ లక్ష్మి, షాదిముబారక్ పథకాలు పేద కుటుంబాలకు కొండంత అండ. కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # అర్హులైన ప్రతి రైతుకు రైతు భరోసా పథకం ప్రయోజనాలు పారదర్శకంగా అందిస్తాం: జిల్లా కలెక్టర్ అంకిత్. # జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ తుకారామ్ రాథోడ్ ఆధ్వర్యంలో పదవీ విరమణ పొందిన వైద్య సిబ్బందికి సన్మానం. # కార్మికుల న్యాయమైన వేతన హక్కులను కాలరాయొద్దు – 12వ వేతన కమిటీని వెంటనే ఏర్పాటు చేయాలి. # వట్టికొండ రజిని జయంతి సందర్భంగా పేదలకు నిత్యావసర సరుకులు, బట్టల పంపిణీ. # నూతన జిల్లా పోలీస్ కార్యాలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీని గడువులోపు పూర్తి చేయాలి : రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుధర్శన్ రెడ్డి. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని రాష్ట్ర పరిశీలక బృందం సందర్శించింది. # ప్రజలకు నిర్విరామంగా సేవలందించిన ఉద్యోగుల సేవలు చిరస్మరణీయం: జిల్లా కలెక్టర్ అంకిత్. # ఓటర్ల జాబితా సవరణలో బిఎల్ఏల పాత్ర కీలకం. బిఎల్ఏల సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # వామపక్ష నాయకుల అక్రమ అరెస్టులు అప్రజాస్వామికం.అరెస్టు చేసిన కూనంనేనిని, ఇతర నేతలను భేషరతుగా విడుదల చేయాలి. # వామపక్ష నాయకుల అక్రమ అరెస్టులు అప్రజాస్వామికం. సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # ఇండ్లు లేని పేదల పక్షాన సమిష్టిగా పోరాడుదాం.సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, సిపిఎం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు. # మొహరం పండుగ త్యాగానికి, సేవకు నిదర్శనం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # తల్లిదండ్రుల మందలించడంతో మనస్తాపం చెంది కొడుకు ఆత్మహత్య. # పద్ధతి మార్చుకోండి లేదంటే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవు రౌడీషీటర్లకు డీఎస్పీ అరుణ్ కుమార్ కౌన్సిలింగ్. # ​ బైక్ అదుపుతప్పి కరెంట్ పోల్‌ను ఢీకొట్టిన ప్రమాదంలో సమ్మయ్య అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి. # ప్రాచీన సంస్కృతీ సాంప్రదాయాలను కాపాడుకుందాం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా.

జిల్లాలో మొదటి రోజు టెట్ పరీక్షలు ప్రశాంతంగా ముగిసాయి : జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.

Date : 05 January 2026 10:17 AM Views : 249

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లాలో నిర్వహిస్తున్న ఉపాధ్యాయ అర్హత పరీక్షలు (టెట్) మొదటి రోజు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా పూర్తిగా ప్రశాంతంగా ముగిశాయని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ తెలిపారు. అభ్యర్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న ఈ కీలక పరీక్షలను పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం ముందుగానే అన్ని ఏర్పాట్లు చేసిందని ఆయన తెలిపారు.జిల్లాలో టెట్ పరీక్షల నిర్వహణ కోసం మొత్తం రెండు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఇందులో భాగంగా పాల్వంచ అనుబోస్ ఇంజనీరింగ్ కాలేజ్ నందు ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రంలో రెండు సెషన్లకు కలిపి 200 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా, మొదటి సెషన్‌కు 44 మంది, రెండవ సెషన్‌కు 38 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారని తెలిపారు.అలాగే అబ్దుల్ కలాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజికల్ సైన్సెస్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రంలో రెండు సెషన్లకు కలిపి 200 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా, మొదటి సెషన్‌కు 60 మంది, రెండవ సెషన్‌కు 74 మంది అభ్యర్థులు పరీక్షలు రాశారని జిల్లా కలెక్టర్ వివరించారు.ఈ విధంగా మొదటి రోజు టెట్ పరీక్షలకు జిల్లాలో మొత్తం 400 మంది అభ్యర్థులు హాజరుకావాల్సి ఉండగా, అందులో 216 మంది అభ్యర్థులు మాత్రమే పరీక్షలకు హాజరై, 184 మంది అభ్యర్థులు గైహాజరు అయినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు, సీసీ కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణ చేపట్టినట్లు తెలిపారు. అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తాగునీరు, విద్యుత్, వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంచామని తెలిపారు. అలాగే పరీక్షా కేంద్రాల పరిసరాల్లో 163 బి.ఎన్.ఎస్.ఎస్ సెక్షన్ అమలు చేస్తూ ప్రశాంత వాతావరణాన్ని కల్పించినట్లు ఆయన తెలిపారు.టెట్ పరీక్షల నిర్వహణలో పాల్గొన్న విద్యాశాఖ అధికారులు, కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు, పర్యవేక్షకులు, సిబ్బంది, పోలీసు శాఖ అధికారుల సమన్వయంతో పరీక్షలు సజావుగా నిర్వహించగలిగామని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ తెలిపారు. మిగిలిన పరీక్షలు కూడా ఇదే విధంగా ప్రశాంతంగా, పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆయన స్పష్టం చేశారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :