తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం ఏరియాకి 2026-27 వార్షిక ఉత్పత్తి లక్ష్యాన్ని నిర్దేశించటానికి టార్గెట్ కమిటీ మెంబర్స్ జిఎం (సిపిపి) ఏ. మనోహర్ జి.ఎం (క్వాలిటి) కొత్తగూడెం రీజియన్ జె. వెంకటరమణ, జిఎం (ఐ&పిఎం) మిరియాల శ్రీహరి, జి.ఎం (ఈ&ఎం) అండర్ గ్రౌండ్స్ (UG) మైన్స్ వై రఘురామరెడ్డి, జి.ఎం. (OCP's) డివిఎస్. సూర్యనారాయణ రాజు , కొత్తగూడెం ఏరియా జిఎం ఎం. షాలేం రాజు 20.09.2025 (శనివారం) రోజున జిఎం కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ లో కొత్తగూడెం ఏరియాలోని వివిధ విభాగాల అధిపతులు / అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సంధర్భముగా కమిటీ సభ్యులు మరియు కొత్తగూడెం ఏరియా జిఎం ఎం. షాలేం రాజు 2026-27 వార్షిక ఉత్పత్తి లక్ష్యాన్ని మరియు వార్షిక ప్రణాళిక నిర్దేశించటం గురించి కొత్తగూడెం ఏరియా లోని అన్నీ గనుల ప్రాజెక్టు ఆఫీసర్లు, మేనేజర్లు, ప్రొజెక్టు ఇంజనీర్లు మరియు సర్వే ఆఫీసర్ల తో సుధీర్ఘముగా చర్చించారు.ఈ యొక్క కార్యక్రమములో కమిటీ సభ్యులతో పాటు కొత్తగూడెం ఏరియా జిఎం ఎం. షాలేం రాజు , ఎస్ఓటు జిఎం జీవి కోటిరెడ్డి , ఏరియా ఇంజనీర్ కే. సూర్యనారాయణ రాజు, ప్రాజెక్ట్ ఆఫీసర్లు, మేనేజర్లు, ప్రాజెక్ట్ ఇంజనీర్లు, సర్వే ఆఫీసర్లు మరియు ఇతర విభాగాల అధిపతులు, అధికారులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ