Thursday, 15 January 2026 05:42:55 AM
# సంక్రాంతి, కనుమ పండుగల సందర్భంగా జిల్లా ప్రజలకు కలెక్టర్ జితేష్ వి. పాటిల్ శుభాకాంక్షలు. # జర్నలిస్టుల అక్రమ అరెస్టులుహేయమైన చర్య జర్నలిస్టులను అర్ధరాత్రి అరెస్టు చేయడం సరైంది కాదు. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మున్సిపల్ ఎన్నికలలొ జనసేన పోటీకి సిద్ధం. వేముల కార్తీక్. # హెచ్ పి సి కంపెనీ విజయవాడ రీజినల్ పరిధిలో గృహ అవసరాల గ్యాస్ అమ్మకం లో మొట్ట మొదటి స్థానం లో నిలిచిన సివిల్ సప్లయ్స్ పాల్వంచ ఎల్ పి జి సెంటర్. # భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో 60 డివిజన్లో ముగ్గుల పోటీలు. # ప్రతి ఒక్కరూ స్వీయ క్రమశిక్షణతో రోడ్డు ప్రమాదాల నివారణకు సహకరించాలి: ఎస్పీ రోహిత్ రాజు. # జిల్లాలోని దుమ్ముగూడెం మరియు పర్ణశాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగినది. డాక్టర్ తూకారామ్ రాథోడ్. # అభివృద్ధి, సంక్షేమాన్ని రెండు కళ్లలా అమలు చేస్తున్నాం – మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. # నిరుద్యోగులకు ఉచిత శిక్షణ, ఉపాధి. # ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ఘనంగా స్వామి వివేకానంద 163 వ జయంతి. ఏఐవైఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్కే ఖయ్యూం, జిల్లా ఉపాధ్యక్షుడు బరిగెల భూపేష్. # ప్రతిష్టాత్మకంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల నిర్మాణం. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ప్రణాళికా శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క # మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు . # దివ్యాంగ కుటుంబానికి నిత్యావసరాలు అందజేత # 69వ అండర్–17 బాలుర జాతీయ కబడ్డీ పోటీలు, చివరి దశకు సెమీఫైనల్‌కు అర్హత సాధించిన జట్లు. # మోడ్రన్ ఇఖ్రా పాఠశాలలో ఘనంగా ముందస్తు సంక్రాంతి వేడుకలు : కరస్పాండెంట్ షేక్ అబ్దుల్ బాసిత్. # మెరుగైన నైపుణ్యాలతోనే యువతకు అవకాశాలు. జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్. # పాల్వంచ పట్టణంలోని శ్రీ గణేష్ నర్సింగ్ హోమ్, పద్మావతి స్కానింగ్ సెంటర్, శ్రీరక్ష హాస్పిటల్ మరియు స్కానింగ్ సెంటర్లను ఆకస్మికంగా తనిఖీ. # కెటిపిఎస్ 7 వ స్టేజ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ చీఫ్ కె. శ్రీనివాస్ బాబు ని ఘనంగా సన్మానించిన. ఇంజనీర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వై.వెంకటేశ్వర్లు. # TG TET–2026 పరీక్షలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రశాంతంగా నిర్వహణ: జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్. # సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి చేయడమే ప్రభుత్వ లక్ష్యం : భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.

69వ అండర్–17 బాలుర జాతీయ కబడ్డీ పోటీలు, చివరి దశకు సెమీఫైనల్‌కు అర్హత సాధించిన జట్లు.

Date : 10 January 2026 08:50 PM Views : 152

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : పినపాక మండలంలోని ఏడూళ్ల బయ్యారం గ్రామంలో పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 69వ అండర్–17 బాలుర జాతీయ కబడ్డీ పోటీలు చివరి అంకానికి చేరుకున్నాయి. శనివారం నిర్వహించిన ఫ్రీ క్వార్టర్ ఫైనల్స్, క్వార్టర్ ఫైనల్స్ ఉత్కంఠభరితంగా సాగగా, విజయం సాధించిన జట్లు సెమీఫైనల్స్‌కు అర్హత సాధించాయి. శనివారం జరిగిన ఫ్రీ క్వార్టర్ ఫైనల్ మ్యాచుల్లో విద్యా భారతి జట్టుపై పంజాబ్ జట్టు 57–56తో విజయం సాధించింది. రెండో మ్యాచులో కేరళపై తెలంగాణ జట్టు 62–44తో గెలుపొందింది. మూడో మ్యాచులో ఆంధ్రప్రదేశ్‌పై ఉత్తరప్రదేశ్ జట్టు 70–44తో విజయం సాధించింది. నాలుగో మ్యాచులో గుజరాత్‌పై పుదుచ్చేరి జట్టు 49–44తో గెలిచింది. ఐదో మ్యాచులో మణిపూర్‌పై రాజస్థాన్ జట్టు 55–37తో విజయం సాధించింది. ఆరో మ్యాచులో సీబీఎస్‌ఈపై కర్ణాటక జట్టు 63–44తో గెలుపొందింది. ఏడో మ్యాచులో మధ్యప్రదేశ్‌పై హర్యానా జట్టు 67–33తో విజయం సాధించింది. ఎనిమిదో మ్యాచులో మహారాష్ట్రపై తమిళనాడు జట్టు 53–40తో గెలిచింది.మధ్యాహ్నం జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచుల్లో పంజాబ్‌పై తెలంగాణ జట్టు 68–46తో విజయం సాధించి సెమీఫైనల్‌కు చేరుకుంది. పుదుచ్చేరిపై ఉత్తరప్రదేశ్ జట్టు 69–45తో గెలిచి సెమీఫైనల్‌కు అర్హత సాధించింది. తమిళనాడు‌పై హర్యానా జట్టు 51–50తో స్వల్ప తేడాతో విజయం సాధించి సెమీఫైనల్‌కు చేరుకుంది.ఆదివారం సెమీఫైనల్ మరియు ఫైనల్ మ్యాచులు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :