తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొత్తగూడెం పట్టణం నడిబొడ్డున సజీవ గంగా నది వలె ప్రవహిస్తున్న ముర్రేడు వాగు ఓడ్డున వేoచేసి కొలువై ఉన్నట్టి శ్రీ లక్ష్మీ గణపతి, శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, అయ్యప్ప స్వామి వారలకు పూర్తిస్థాయిలో మహోన్నతమైన,మహత్తరమైన దివ్య ఆలయాల సన్ని ధానమును నిర్మించ తలపెట్టి ది 25 /1/2015న దైవజ్ఞులచే నిర్ణయింప బడిన సుహుమూర్తము నకు భూమి లోపల 18 అడుగుల లోతున మూడు ఆలయాలకు వేదమంత్రాలు, స్వామి శరణు ఘోషల మధ్యన శంకుస్థాపన నిర్వహించి నేటి వరకు మొదటి స్లాబును పూర్తి చేసినారు. స్వామివారి ఆలయాలు మొదటి అంతస్తులో నిర్మింపబడతాయి. ఆలయ విశిష్టతలు: ప్రస్తుత సన్నిధాన నిర్మాణ ప్రాంగణానికి ఉత్తర దిశ నుండి ముర్రేడు వాగు ప్రవహించుచు ఆలయ ప్రాంగణాన్ని తాగుతూ తూర్పునకు అభిముఖంగా సాగి పోవుచున్నది. అలాగే కాశీలోని గంగా నది ఉత్తరం వైపు నుండి ప్రవహిస్తూ విశ్వేశ్వర ఆలయాన్ని తాకుచూ తూర్పునకు అభిముఖంగా సాగి పోవుచున్నది. కాశీలోని విశ్వేశ్వర ఆలయమునకు ఉన్నటువంటి వాస్తు ప్రస్తుతం ఈ ఆలయానికి మాత్రమే సంతరించ బడి ఉన్నది. కావున ఈ నూతన సన్నిధానము కూడా అనతి కాలములోనే దక్షిణ కాశీ లాగున విరాజుల్లుతుంది అనడములో అతిశయోక్తి లేదని ఋత్వికుల ఉవాచా . ముందస్తు జాగరుకలతో తరతరాలు నిలిచిపోయే విధమైన మహత్తరమైన సన్నిధానాన్ని నిర్మాణం చేయుచున్నారు. ఆలయ నిర్మాణంలో పాలుపంచుకోవడం అన్నది సమస్త దానము లలో కెల్లా అత్యున్నతమైనది కావున ప్రతి హిందువు, ప్రతి భక్తుడు తమ శక్తి కొలది స్వామి వారి ఆలయల నిర్మాణమునకు విరాళాలను అందజేసి తరించ వలసినదిగా, తాము చెల్లించిన విరాళముల కు తగు రసీదును తప్పనిసరిగా పొందవలసినదని విజ్ఞప్తి చేయుచున్నారు. కాగా సదరు సన్నిధాన నిర్మాణం త్వరితగతిన పూర్తి కావాలనే సంకల్పం తో జగన్నాధపురం పెద్దమ్మ తల్లి ఆశీస్సులు కోరుతూ కొత్తగూడెం, ముర్రేడు వాగు వద్ద నున్న అయ్యప్ప సన్నిధానం నుండి అనేకమంది దీక్షాపరులు పాదయాత్ర గా పెద్దమ్మ తల్లి దేవాలయానికి బయలుదేరిన సందర్భంగా కొత్తగూడెం సబ్ డివిషనల్ పోలీస్ ఆఫీసర్ షేక్. అబ్దుల్ రహమాన్, స్పెషల్ జ్యుడిషియల్ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ మెండు రాజమల్లు జెండా ఊపి పాదయాత్రను ప్రారంభించినారు. ఈ పాదయాత్ర లో సుమారు 200 మందికి పైగా దీక్షాపరులు పాల్గొనినారు.
Admin
తెలుగు వెలుగు టీవీ