తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పనితీరును విశ్లేషించడానికి గత రెండు రోజులుగా గాంధీ భవన్ లో టీపీసీసీ జనరల్ సెక్రటరీలతో ఏఐసీసీ తెలంగాణ ఇంఛార్జ్ చర్చలు నిర్వహిస్తున్నారు.ఈ క్రమంలో ఈరోజు టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములుతో ఏఐసీసీ ఇంఛార్జ్ కార్యదర్శి సచిన్ సావంత్ వన్ టు వన్ గా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సీతారాములు జనరల్ సెక్రటరీ బాధ్యతలు చేపట్టిన తరువాత 14 నెలల కాలంలో 26 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇంచార్జ్ గా తాను చేసిన కృషిని, అలాగే SIR - ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని BLA, BLO మరియు సూపర్ వైజర్లను సమన్వయం చేసి విజయవంతంగా పూర్తి చేసిన వివరాలను వివరించారు.సచిన్ సావంత్ సీతారాములు పనితీరును ప్రత్యేకంగా అభినందించారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకువెళ్లటానికి మీ కృషి అవసరం అని అన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ