Friday, 19 June 2026 01:35:21 PM
# టాస్క్ఫోర్స్ మరియు అన్నపురెడ్డి పల్లి పోలీసులు చేపట్టిన వాహన తనిఖీల్లో భారీగా 44.30 లక్షలు విలువైన గంజాయి స్వాధీనం. # కిన్నెరసానిని ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం. కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # ప్రశాంత వాతావరణంలో టీజీ టెట్ పరీక్షలు. జిల్లా కలెక్టర్ అంకిత్ . # జూలూరుపాడు ప్రభుత్వ పాఠశాల నందు సామూహిక అక్షరాభ్యాసం # వైకుంఠ రధం రిపేర్ చేయించి ఉపయోగమునకు తీసుకురావాలి. మేనేజర్ కి వినతి పత్రం అందించిన సిపిఐ జిల్లా నాయకులు మునిగడప వెంకటేశ్వర్లు. # ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మరమ్మత్తు పనులు త్వరితగతిన పూర్తి చేయాలి – జిల్లా కలెక్టర్ అంకిత్. # అర్హుల గుర్తింపులో పారదర్శకత పాటించాలి – జిల్లా కలెక్టర్ అంకిత్. # ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించే బాధ్యత ఎంఈఓలదే – జిల్లా కలెక్టర్ అంకిత్. # రాష్ట్రంలో బిజెపి జెండా ఎగిరేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి - విలేకరుల సమావేశంలో ఉదయ్ ప్రతాప్, బైరెడ్డి. # పారిశుద్ధ్య కార్మికుడు శేషు అకాల మరణం అత్యంత బాధాకరం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, మేయర్ మూడ్ గణేష్. # ముఖ్యమంత్రి పంపిన లేఖ, పుష్పగుచ్ఛం అందుకోవడం సంతోషకరం. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # కొత్తగూడెంలో మణుగూరు సూపర్ ఫాస్ట్ రైలు కింద పడి వ్యక్తి మృతి. # వెంకటయ్య మృతి పార్టీకి తీరని లోటు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండండి - ఎస్బీఐ రీజినల్ మేనేజర్ పీజీఎన్ శర్మ. # ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో అధిక ఫీజుల వసూళ్లను తక్షణమే నియంత్రించాలి. ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎస్కే షాహిద్, వరక అజిత్. # అమృత్ పథకం నిధులతో వేగవంతంగా సాగుతున్న నీటి పథకాల నిర్మాణ పనులు. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మిత్రుడి కుటుంబానికి అండగా నిలిచిన పూర్వ విద్యార్థులు. # సాధారణ ప్రసవాలను పెంచాలి – మాతృ, శిశు మరణాలను తగ్గించాలి. జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డా. తుకారాం రాథోడ్. # జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు పటిష్టంగా అమలు చేయాలి. Dr తుకారాం రాథోడ్ DMHO. # గుడిపాడు యూపీహెచ్‌సీని సందర్శించిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. తుకారాం రాథోడ్.

విద్య, వైద్యం రంగాలకు సీఎస్‌ఆర్ నిధుల్లో అధిక ప్రాధాన్యత ఇవ్వాలి - జిల్లా కలెక్టర్ అంకిత్

Date : 15 June 2026 06:28 PM Views : 20

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లాలో విద్యా, వైద్య రంగాల అభివృద్ధికి కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్) నిధుల్లో అధిక ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ అంకిత్ అన్నారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లాలోని సింగరేణి, కేటీపీఎస్, నవభారత్, ఐటీసీ తదితర పరిశ్రమల ప్రతినిధులతో సీఎస్‌ఆర్ నిధుల ద్వారా అమలవుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, చేపట్టాల్సిన కొత్త పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, ఏరియా ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించేందుకు పాఠశాలల్లో తరగతి గదుల అభివృద్ధి, ఫర్నిచర్, తాగునీటి సదుపాయాలు, పారిశుద్ధ్య వసతులు, డిజిటల్ విద్యా సౌకర్యాల ఏర్పాటు వంటి అంశాలకు సీఎస్‌ఆర్ నిధులను వినియోగించాలని కోరారు. ప్రభుత్వ ఆసుపత్రులు, ఆరోగ్య కేంద్రాల్లో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అవసరమైన పరికరాలు, మౌలిక వసతులు, రోగుల సౌకర్యాల కల్పనకు పరిశ్రమలు సహకరించాలని తెలిపారు. ముఖ్యంగా గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో ఆరోగ్య సేవల విస్తరణకు అవసరమైన కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ప్రజావాణి కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి అందుతున్న వినతులు, ఫిర్యాదులు, స్థానిక అవసరాల ఆధారంగా సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి సీఎస్‌ఆర్ నిధులను వినియోగించేలా ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రజలకు ప్రత్యక్ష ప్రయోజనం చేకూరే పనులను ఎంపిక చేసి, సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుంటూ వేగవంతంగా అమలు చేయాలని చెప్పారు. గిరిజన, గుత్తికోయ ప్రాంతాల్లో విద్య, వైద్యం, తాగునీటి సదుపాయాల మెరుగుదలకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించిన కలెక్టర్, జిల్లాలోని అన్ని పరిశ్రమలు సామాజిక బాధ్యతతో ముందుకు వచ్చి ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాలని కోరారు. సీఎస్‌ఆర్ నిధుల వినియోగం ద్వారా ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే శాశ్వత అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయాలని అన్నారు. సమావేశంలో పరిశ్రమల ప్రతినిధులు తమ సంస్థల ద్వారా ఇప్పటివరకు చేపట్టిన సీఎస్‌ఆర్ కార్యక్రమాల వివరాలను వెల్లడించగా, భవిష్యత్తులో చేపట్టనున్న పనులపై చర్చించారు. ఈ సమావేశం లో సి పి ఓ సంజీవరావు,సంబంధిత శాఖల అధికారులు, వివిధ పరిశ్రమల ప్రతినిధులు సమావేశంలో పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :