తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : నేటి ఎస్.ఎస్.సి ఫలితాలలో ఎప్పటిలాగే త్రివేణి విద్యార్థులు తమ సత్తా చాటారు. టాప్ మార్కులను సాధించి తమ ప్రతిభ ను చూపారు. ప్రగతి ఫలాల తెలంగాణాలో రాష్ట్రవ్యాప్తంగా ఈరోజు విడుదలైన పదవ తరగతి ఫలితాల్లో త్రివేణి విద్యార్థులు విజయదుంధిభి మ్రోగించారు. ఈ సందర్భంగా కొత్తగూడెంలో త్రివేణి కృష్ణవేణి విద్యాసంస్థల డైరెక్టర్ గొల్లపూడి జగదీష్ పత్రికలకు ప్రకటనను విడుదల చేసారు. తమ విద్యార్థులు గత ఎస్.ఎస్.సి గ్రేడుల్లో మేమే, నేటి మార్కుల్లో కూడా మా త్రివేణి ముందంజలో ఉందని నిరూపించుకుంది. ఎస్.ఎస్.సి మార్కుల ప్రకారం 600కి మార్కులు 593 మా విద్యార్థిని ఆర్, రిషిక శ్రీ సాధించినదని తెలిపారు. ఇవే కాకుండా 590, 587, 587, 587, 586, 586, 586, 586, 584, 583, 583, 583, 582, 582, 581, 581, 581, 581, 580, 580, 580 ఆ పైన సాధించిన వారు 22 మంది, 570 పైన సాధించినవారు 42 మంది సాధించి రాష్ట్రస్థాయిలో ఉత్తమమైన ఫలితాలు సాధించి త్రివేణిని మొదటి స్థానంలో నిలిపారు. కొత్తగూడెంలోని త్రివేణిహైస్కూల్లో 600కి గాను 593 మార్కులను సాధించి కొత్తగూడెం త్రివేణి ఖ్యాతిని చాటిచెప్పారు, 580 పైన నలుగురు, 570 పైన 19 మంది, 560 పైన 35 మంది, 550 పైన 53 మంది సాధించారని డైరెక్టర్ గొల్లపూడి జగదీష్ తెలిపారు. కొత్తగూడెం పట్టణంతో పాటు జిల్లా, రాష్ట్రస్థాయి లో తన కంటూ ఒక ప్రత్యేకతను త్రివేణి కలిగి ఉందన్నారు. అనుభవం, అంకితభావంగల బోధనా సిబ్బంది ఉండటంవలన ఈ సంచలన విజయాలు సాధించడం సాధ్యమైందని పేర్కొన్నారు. విజయం సాధించిన విద్యార్థులకు త్రివేణి పాఠశాలల డైరెక్టర్స్ శ్రీ గొల్లపూడి వీరేంద్ర చౌదరి, గొల్లపూడి జగదీశ్, సి.ఆర్.ఓ. కాట్రగడ్డ మురళీ కృష్ణ, ప్రిన్సిపాల్స్ వై.వి.సురేష్, శ్రీనివాస్ సింగ్ మరియు వైస్ ప్రిన్సిపాల్ సౌజన్య అభినందలను తెలియజేసారు..
Admin
తెలుగు వెలుగు టీవీ