Wednesday, 16 September 2026 08:15:49 PM
# జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్.

పీఎం ధర్తీ అభాజాన్ జాతీయ ఉత్కర్ష అభియాన్ పథకం గిరిజనులకు అందరికీ అందాలి.. జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్

Date : 26 August 2025 07:20 PM Views : 543

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఏజెన్సీ ఏరియాలోని మారుమూల దట్టమైన అటవీ ప్రాంతాలలో నివసిస్తున్న గిరిజనులకు పీఎం ధర్తీ ఆభాజాన్ జాతీయ గౌరవ ఉత్కర్ష అభియాన్ పథకంలో భాగంగా గిరిజనులను చైతన్యపరిచి వారికి కావలసిన మౌలిక సదుపాయాలు కల్పించే విధంగా సంబంధిత అధికారులు అవగాహన కల్పించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. మంగళవారం నాడు జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్లో ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్, అదనపు కలెక్టర్ వేణుగోపాల్ మరియు ఇతర అధికారులతో పీఎం ధర్తీ ఆభాజాన్ జాతీయ గౌరవ ఉత్కర్ష అభియాన్ కార్యక్రమం విజయవంతం అవ్వడానికి తీసుకోవలసిన కార్యాచరణ పై వివిధ శాఖల అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి అధికారుల చేత పిఎం ధర్తీ ఆభాజాన్ జాతీయ గౌరవ ఉత్కర్ష అభియాన్ కి సంబంధించిన ప్రతిజ్ఞ చేయించిన అనంతరం ఆయన మాట్లాడుతూ ఏజెన్సీ ఏరియా పరిధిలోని మారుమూల గ్రామాలు ఎక్కువగా ఉన్న 19 మండలాలలోని 134 గ్రామాలలో పిఎం ధర్తీ ఆభాజాన్ జాతీయ గౌరవ ఉత్కర్ష అభియాన్ పథకం పగడ్బందీగా అమలు చేయడానికి జిల్లా స్థాయి అధికారులకు హైదరాబాదులోని నిమ్స్ మిక్ (ఎన్ ఐ ఎన్ ఎస్ ఎం ఈ) కేంద్రంలో ప్రత్యేక శిక్షణా కార్యక్రమం అందించడం జరిగిందని, జిల్లాస్థాయి కమిటీ సభ్యులు మండల స్థాయిలో బ్లాకుల వారీగా కమిటీలు ఏర్పాటు చేసి వారికి శిక్షణ అందించి ఆ గ్రామాలలోని ప్రజలకు వారికి కావలసిన మౌలిక వసతుల గురించి అవగాహన కల్పించి ప్రణాళికలు సిద్ధం చేయాలని అన్నారు.

ముఖ్యంగా ఆ గ్రామాలలోని గిరిజనులకు విద్య, వైద్యం, రూరల్ డెవలప్మెంట్, ఐ సి డి ఎస్, ఫారెస్ట్, జల్ జీవన్ మిషన్, గిరిజన సంక్షేమ శాఖ, ఆర్డబ్ల్యూఎస్ ద్వారా గ్రామాలలో చేపట్టవలసిన మౌలిక వసతులపై ప్రత్యేక క్యాంపులు నిర్వహించి ప్రజలందరికీ ఆ శాఖల ద్వారా వారు లబ్ధి పొందేలా చూడాలని అన్నారు. మండలం లెవెల్ కమిటీ సభ్యులు ఇంటింటికి తిరిగి గిరిజనులకు ఈ పథకాల గురించి అవగాహన కల్పించి ఆ గ్రామంలోని పెద్దలను గిరిజనులను ఒకచోట చేర్చి గ్రామసభలో ఆ గిరిజనులకు కావలసిన మౌలిక వసతులు ముఖ్యంగా విద్యా వైద్యం, మంచినీటి సౌకర్యం, కరెంటు, గ్రామంలోని రోడ్లు, అటవీ శాఖ సంబంధించిన పోడు పట్టాలు, గిరిజన సంక్షేమ శాఖ, రూరల్ డెవలప్మెంట్ ద్వారా వారికి కావలసిన సంక్షేమ పథకాలు,గిరిజన రైతులకు జల్ జీవన్ మిషన్ ద్వారా కావలసిన సదుపాయాలు ఇతర పథకాల గురించి వారికి అవగాహన కలిగించాలని అన్నారు. ప్రతి శాఖల అధికారులు ప్రత్యేక బాధ్యత తీసుకొని ఈ కార్యక్రమంలో పాల్గొని ఎక్కువ శాతం గిరిజనులకు అన్ని రకాల సౌకర్యాలు కలిగేలా పగడ్బందీ చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డి ఆర్ డి ఓ విద్యాచందన, సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్, డిఎంహెచ్ఓ విజయలక్ష్మి, డీఈవో నాగలక్ష్మి, ఏవో సున్నం రాంబాబు, ఐ సి డి ఎస్ పిడి స్వర్ణలత లేనినా, ఆర్డబ్ల్యూఎస్ డీఈ హరిలాల్ మరియు ఇతర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :