Thursday, 17 September 2026 04:46:38 PM
# జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్.

జ్యువెలరీ షాప్ యజమానులు తమ దుకాణాలు మరియు పరిసర ప్రాంతాల్లో పటిష్టమైన భద్రత ఏర్పాట్లను చేసుకోవాలి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్

Date : 13 August 2025 05:04 PM Views : 1297

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : తమ వ్యాపార సముదాయాల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ జిల్లా వ్యాప్తంగా ఉన్న జ్యువెలరీ వ్యాపారస్తులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి వారికి పలు సూచనలు చేసిన జిల్లా ఎస్పీ ఈ రోజు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో ఉన్న జ్యువెలరీ షాప్ యజమానులతో సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశాన్ని కొత్తగూడెం పట్టణంలోని IMA ఫంక్షన్ హాల్ నందు నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో గల జ్యువెలరీ షాపుల యజమానులు పాల్గొన్నారు.ఈ సమావేశంలో పాల్గొన్న జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ వారికి పలు సూచనలు చేశారు.బంగారు నగల దుకాణాల యజమానులు వారి దుకాణాలలో మరియు పరిసర ప్రాంతాల్లో పకడ్బందీగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవడం ద్వారా దొంగతనాలను నివారించవచ్చని తెలిపారు.దొంగతనాలకు పాల్పడిన నిందితుల వద్ద నుండి ఆభరణాలను కొనుగోలు చేయకూడదని,ఎవరైనా దొంగసొత్తును కొనుగోలు చేస్తే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు.వ్యాపారస్తులు దొంగతనాలు జరగకుండా అరికట్టడానికి పోలీసు వారు సూచనలను పాటిస్తూ జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు.ఇటీవల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సంఘటనలను దృష్టిలో పెట్టుకొని ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. బంగారు నగలు వ్యాపారస్తులు తమ దుకాణాల పరిసరాలలో ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు.తమ తమ దుకాణాలలో పనిచేసే వ్యక్తుల గురించి,వారి ప్రవర్తన గురించి పూర్తి వివరాలు తెలుసుకొని మాత్రమే వారిని పనిలో పెట్టుకోవాలని సూచించారు.తమ దుకాణాల చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసించే వారి కదలికలపై కూడా సరైన అవగాహన కలిగి ఉండాలని తెలిపారు.ఎక్కువ మొత్తంలో బంగారు ఆభరణాలను తమ దుకాణాలలో ఉంచవలసి వచ్చినప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.తమ వ్యాపార సముదాయాల వద్ద సెక్యూరిటీ గార్డులను ఏర్పాటు చేసుకొని రాత్రి వేళల్లో గస్తీని పెంచుకోవాలన్నారు.ఇప్పటివరకు జిల్లాలో జరిగిన పలు దొంగతనాల కేసుల్లో సీసీటీవీ కెమెరాల ఆధారంగా మరియు పోలీస్ శాఖ వినియోగిస్తున్న సాంకేతికతను ఆధారంగా నిందితులను పట్టుకొని బాధితులకు న్యాయం చేకూర్చడం జరిగిందని అన్నారు.దొంగతనాలు జరగకుండా ప్రతి ఒక్కరూ ముందస్తు జాగ్రత్తలు తీసుకుని పోలీసు వారికి సహకరించాలని కోరారు.అనంతరం ఈ సమావేశంలో పాల్గొన్న బంగారు నగల దుకాణాల యజమానుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఐపిఎస్,ఇల్లందు డిఎస్పి చంద్ర భాను,కొత్తగూడెం డిఎస్పీ రెహమాన్,మణుగూరు డిఎస్పి రవీందర్ రెడ్డి,పాల్వంచ డిఎస్పీ సతీష్ కుమార్,సీసిఎస్ సీఐ రమాకాంత్, చుంచుపల్లి సీఐ వెంకటేశ్వర్లు, కొత్తగూడెం 2టౌన్ ఇన్స్పెక్టర్ ప్రతాప్, 1టౌన్ ఇన్స్పెక్టర్ కరుణాకర్,3టౌన్ ఇన్స్పెక్టర్ శివ ప్రసాద్ మరియు ఇతర పోలీసు అధికారులు,సిబ్బంది పాల్గొన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :