Monday, 03 August 2026 05:08:37 AM
# సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్: ₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం. # ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో స్కార్ఫ్ డే # సుజాత నగర్, బాలాజి నగర్ ల్లో వీధి కుక్కల బెడత. # జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకోండి – పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించండి. # నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ & పీఎం) కిరణ్ కుమార్‌కు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు. # భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు, ERO రవికుమార్. # 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం. # ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు, బిఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి . # 50 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్. # సారపాక,రెడ్డిపాలెం, తూర్పాక,దుమ్ముగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # తాటి సురేష్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా, కోమరి కృష్ణ సన్మానం. # భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మేరా యువ భారత్, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఘనంగా ముగిసిన 8 రకాల జిల్లాస్థాయి పోటీలు. # ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం. # గోదావరి వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # 16వ డివిజన్లో నూతన కాలువ నిర్మాణ పనులు ప్రారంభం.కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘన సన్మానం. # కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై సమరశంఖం పూరించాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

పదవ తరగతి పరీక్షలు దగ్గర పడుతున్నందున పిల్లలపైఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్.

Date : 16 February 2026 08:26 PM Views : 259

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : పదవ తరగతి పరీక్షలు దగ్గర పడుతున్నందున పిల్లలపై ప్రత్యేక దృష్టి సారించి అన్ని సబ్జెక్టులు పిల్లలు ఎటువంటి భయాందోళనలో పెట్టుకోకుండా పరీక్షలు రాసేలా సంబంధిత ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ సంబంధిత ఉపాధ్యాయులకు సూచించారు. సోమవారం నాడు కొత్తగూడెంలోని పీఎంహెచ్ మరియు పాల్వంచలోని ఏ జి హెచ్ ఎస్, రామవరం లోని పాలిటెక్నిక్ కళాశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి పదవ తరగతి పరీక్షలు దగ్గర పడుతున్నందున ఉదయము సాయంత్రం స్టడీ అవర్స్ తప్పనిసరిగా నిర్వహించాలని, పరీక్షలు అయిపోయే వరకు విద్యార్థినీ విద్యార్థులను ఎవరిని ఇండ్లకు పంపకూడదని, డ్రాప్ అవుట్ పిల్లలు ఎవరైనా ఉంటే వెంటనే వారిని పాఠశాలలకు తీసుకొని రావాలని అందుకు ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అన్నారు. పిల్లలు ఎక్కువ శాతం తెలుగు సబ్జెక్టులలో ఫెయిలవుతున్నారని సంబంధిత సబ్జెక్టు టీచర్లు తెలుగు సబ్జెక్ట్ చదవడంలో ఎవరైనా వెనుకబడి ఉంటే వారిపై దృష్టి సారించాలని, పదో తరగతి చదువుతున్న విద్యార్థినీ విద్యార్థులు ఎటువంటి మనసులో భయాలు పెట్టుకోకుండా బాగా చదువుకొని పరీక్షలు బాగా రాసి అత్యుత్తమ మార్కులతో పాస్ కావాలని, అనంతరం పరిసరాలు మరియు స్టోర్ రూమ్ పరిశీలించి పిల్లలకు మెనూ ప్రకారం సమయానుకూలంగా అల్పాహారంతో మొదలుకొని రాత్రి డిన్నర్ వరకు అందజేయాలని, స్టడీ అవర్స్ నిర్వహణలో ఉపాధ్యాయులు అలసత్వం వహించకూడదని, సంబంధిత హెచ్ఎం ప్రతిరోజు పిల్లలు చదువుతున్న సబ్జెక్టులను పరిశీలించాలని అన్నారు. రామవరం లోని పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులను కలిసి భవిష్యత్తులో ఏం కావాలని అనుకోని కోరి తీసుకున్న సబ్జెక్టులను బాగా ప్రాక్టికల్ చేసి అనుకున్నది సాధించే వరకు విశ్రమించకూడదని అన్నారు. అనంతరం విద్యార్థినీలు ఆడుతున్న చెస్ గేమ్ ను పరిశీలించి చదువుతోపాటు వారికి ఇష్టమైన క్రీడలలో ఆడుకొని నైపుణ్యాలు సాధించేలా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో దమ్మపేట ఏ టి డి ఓ చంద్రమోహన్, హెచ్ఎంలు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. అదనపు పౌర సంబంధాల అధికారి కార్యాలయము భద్రాచలం నుండి జారీ చేయడమైనది.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :