Wednesday, 16 September 2026 06:47:35 PM
# సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ఏజెన్సీ ప్రాంత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత టివిఆర్ చంద్రం.పుస్తకావిష్కరణ సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా. # ప్రభుత్వ లిఖితపూర్వక హామీతోనే ‘చలో హైదరాబాద్’ తాత్కాలిక వాయిదా: TGEJAC ఛైర్మన్ అమరనేని రామారావు. # చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం: టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు.

ఎన్నికల విధులు సమర్థవంతంగా నిర్వహించాలి : జిల్లా కలెక్టర్‌ మరియు జిల్లా ఎన్నికల అధికారి జితేష్‌ వి. పాటిల్‌

Date : 08 October 2025 05:34 PM Views : 299

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల విధులను సమర్థవంతంగా, పారదర్శకంగా నిర్వహించాల‌ని జిల్లా ఎన్నికల అధికారి మరియు కలెక్టర్‌ జితేష్‌ వి. పాటిల్‌ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్‌ క్యాంపు కార్యాలయం నుండి జిల్లా ఎన్నికల నోడల్‌ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఎన్నికల ప్రవర్తన నియమావళి (ఎంసీసీ) అమలు, ఎన్నికల ప్రక్రియ నిర్వహణ వంటి అంశాలపై ఆయన అదనపు కలెక్టర్‌ డి. వేణుగోపాల్‌తో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, ఎన్నికల నిర్వహణలో ప్రతి అధికారి తన బాధ్యతను కట్టుదిట్టంగా, సమన్వయంతో నిర్వర్తించాలని సూచించారు. ఎటువంటి నిర్లక్ష్యం చోటు చేసుకోకుండా ఎన్నికల విధులను పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. ఎంసీసీ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని, వాటి ఉల్లంఘనకు పాల్పడిన వారిపై ఎన్నికల కమిషన్‌ మార్గదర్శకాల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌ కాస్టింగ్‌ ఏర్పాటు చేయడంతో పాటు సెన్సిటివ్‌ మరియు హైపర్‌ సెన్సిటివ్‌ కేంద్రాలను గుర్తించి సంబంధిత పోలీస్‌ అధికారులకు తెలియజేయాలని సూచించారు. మండల కేంద్రాల్లో నామినేషన్ల స్వీకరణకు కావలసిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని, నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ, గుర్తుల కేటాయింపు వంటి ప్రక్రియలపై సంబంధిత సిబ్బందికి పూర్తి అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్‌ ఆదేశించారు. మండల అభివృద్ధి అధికారులు (ఎంపీడీఓలు) కార్యాలయాల్లో హెల్ప్‌ డెస్క్‌లు ఏర్పాటు చేసి అభ్యర్థులు తమ నామినేషన్‌ ఫారాలను ముందుగానే తనిఖీ చేసుకునే సౌకర్యం కల్పించాలని సూచించారు. రిటర్నింగ్‌ ఆఫీసర్లు స్వీకరించిన నామినేషన్లను అదే రోజు Te-Poll సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలని, ప్రతి రోజు సాయంత్రం నాటికి రోజువారీ నివేదికలు సమర్పించాలని ఆయన ఆదేశించారు. తహసీల్దార్లు (మండల MCC నోడల్‌ అధికారులు) SST, FST బృందాల నివేదికలను సేకరించి జిల్లా నోడల్‌ అధికారులకు పంపాలని సూచించారు. ZPTC నామినేషన్ల ప్రక్రియ సంబంధిత RDO / సబ్‌ కలెక్టర్‌ పర్యవేక్షణలో కొనసాగుతుందని తెలిపారు. తుది అభ్యర్థుల జాబితా ప్రకటించిన తర్వాత బ్యాలెట్‌ పేపర్‌ తయారీ మరియు ముద్రణను తెలుగు వర్ణమాల క్రమంలో ఖచ్చితత్వంతో నిర్వహించాలన్నారు. పోలింగ్‌ సామాగ్రిని కేంద్రాల వారీగా వేరు చేసి భద్రంగా ఉంచాలని ఎంపీడీఓలను ఆదేశించారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ మార్గదర్శకాల ప్రకారం ర్యాలీలు, సమావేశాలు, లౌడ్‌ స్పీకర్ల వినియోగానికి సంబంధించి SHO / CI ల నుండి అనుమతులు తప్పనిసరిగా పొందాలని కలెక్టర్‌ సూచించారు. నామినేషన్ల స్వీకరణ అక్టోబర్‌ 9వ తేదీ ఉదయం 10.30 గంటల నుండి అక్టోబర్‌ 11వ తేదీ సాయంత్రం 5.00 గంటల వరకు జరగనుంది. అక్టోబర్‌ 12న నామినేషన్ల పరిశీలన, అక్టోబర్‌ 13న అప్పీల్‌ స్వీకరణ, అక్టోబర్‌ 14న అప్పీల్‌ విచారణ జరగనున్నట్లు తెలిపారు. నామినేషన్ల ఉపసంహరణకు చివరి గడువు అక్టోబర్‌ 15వ తేదీ మధ్యాహ్నం 3.00 గంటల వరకు ఉండగా, అనంతరం తుది అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారని వివరించారు.జిల్లాలో ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా, చట్టబద్ధంగా, సమన్వయంతో నిర్వహించాలని అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. నోడల్‌ అధికారులు అన్ని పోలింగ్‌ కేంద్రాలను సందర్శించి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, జడ్పీ సీఈఓ నాగలక్ష్మి, జిల్లా పంచాయతీ అధికారి రాంబాబు, ఎక్సైజ్ సూపర్డెంట్ జానయ్య మరియు సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :