Monday, 03 August 2026 06:40:30 PM
# సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్: ₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం. # ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో స్కార్ఫ్ డే # సుజాత నగర్, బాలాజి నగర్ ల్లో వీధి కుక్కల బెడత. # జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకోండి – పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించండి. # నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ & పీఎం) కిరణ్ కుమార్‌కు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు. # భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు, ERO రవికుమార్. # 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం. # ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు, బిఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి . # 50 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్. # సారపాక,రెడ్డిపాలెం, తూర్పాక,దుమ్ముగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # తాటి సురేష్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా, కోమరి కృష్ణ సన్మానం. # భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మేరా యువ భారత్, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఘనంగా ముగిసిన 8 రకాల జిల్లాస్థాయి పోటీలు. # ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం. # గోదావరి వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # 16వ డివిజన్లో నూతన కాలువ నిర్మాణ పనులు ప్రారంభం.కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘన సన్మానం. # కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై సమరశంఖం పూరించాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

మణుగూరు మనుగడ కోసం రాజీలేని పోరాటం, ఫలించిన ఎఐటీయూసీ ఉద్యమం

Date : 03 August 2026 04:42 PM Views : 29

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఎఐటియుసి నాయకుల అరెస్టులు, ఆందోళనలు, నిరంతర పోరాటం,చివరకు సింగరేణికే పీకే–2 డీప్ సైడ్ బ్లాక్. రాష్ట్ర ప్రభుత్వ ఒత్తిళ్లను తిప్పికొట్టిన ఎఐటీయూసీ సింగరేణికి దక్కిన పీకే–2 డీప్ సైడ్ బ్లాక్. మణుగూరు పీకే ఓసి డీప్ సైడ్ బొగ్గు బ్లాకు వేలంపాటలో జెన్కో, సింగరేణి సంస్థలు పోటీ పడగా, చివరకు 6.5 శాతం రెవెన్యూ షేర్‌తో సింగరేణి దక్కించుకోవడం గుర్తింపు సంఘం ఎఐటీయూసీ చేపట్టిన నిరంతర పోరాటాలు, ఉద్యమాలు, కార్మికుల ఐక్యస్ఫూర్తికి దక్కిన ఘన విజయమని సంఘం రాష్ట్ర అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్‌కుమార్ పేర్కొన్నారు.సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో వారు మాట్లాడుతూ,మణుగూరు పీకే-2 డీప్ సైడ్ బొగ్గు బ్లాకు విషయంలో జెన్కోను వేలంపాట ప్రక్రియ నుంచి తప్పించాలని ఉద్యమం చేసిన ఏకైక కార్మిక సంఘం ఎఐటియుసి అన్నారు,అంలదేవిధంగా సింగరేణి మాత్రమే వేలంపాటలో పాల్గొనేలా చేసి బ్లాకును సింగరేణికే కేటాయించాలని డిమాండ్ చేసింది, మరియు మణుగూరు పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఎఐటీయూసీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు, ధర్నాలు, రాస్తారోకోలు, గనుల వద్ద ఆందోళనలు, వినతిపత్రాల సమర్పణ, నిరసన కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా, అరెస్టులను సైతం లెక్కచేయకుండా ఉద్యమాన్ని నిరంతరం కొనసాగించామని గుర్తు చేశారు.ఆ ఉద్యమాల ఫలితంగానే నేడు సింగరేణి వేలంలో పాల్గొని 6.5 శాతం రెవెన్యూ షేర్‌తో మణుగూరు పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను దక్కించుకుందని తెలిపారు. ఈ విజయానికి సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖలు, ఎఐటీయూసీ చేపట్టిన ఉద్యమాలు కీలకంగా దోహదపడ్డాయని పేర్కొన్నారు.పీకే–2 డీప్ సైడ్ బ్లాక్ సింగరేణి మనుగడకు ప్రాణాధారమని, వేలాది మంది కార్మికుల ఉపాధి, మణుగూరు ప్రాంత అభివృద్ధి, సింగరేణి సంస్థ భవిష్యత్తు ఈ బ్లాక్‌పైనే ఆధారపడి ఉందన్నారు.రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడితో మణుగూరు బ్లాక్‌ను జెన్‌కో పేరుతో వేలంలో ప్రవేశపెట్టి, చివరకు ప్రైవేట్ కంపెనీలకు అప్పగించేందుకు జరిగిన ప్రయత్నాలను ఎఐటీయూసీ తీవ్రంగా ప్రతిఘటించిందన్నారు "జెన్‌కో కాదు.సింగరేణికే మణుగూరు డీప్ సైడ్ బొగ్గు బ్లాక్ కేటాయించాలి" అనే నినాదంతో చేపట్టిన ఉద్యమం చివరకు విజయాన్ని సాధించిందని తెలిపారు."సేవ్ సింగరేణి – సేవ్ మణుగూరు" నినాదంతో సాగిన ఈ ఉద్యమం కార్మికుల ఐక్యతకు, సంకల్పానికి ప్రతీకగా నిలిచిందన్నారు.జెన్‌కోపై పైచేయి సాధిస్తూ సింగరేణి 6.5 శాతం రెవెన్యూ షేర్‌తో పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను దక్కించుకోవడం ఎఐటీయూసీ ఉద్యమ చరిత్రలో మరో చిరస్మరణీయ విజయమని వాసిరెడ్డి సీతారామయ్య, కొరిమి రాజ్‌కుమార్ స్పష్టం చేశారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :