తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఎఐటియుసి నాయకుల అరెస్టులు, ఆందోళనలు, నిరంతర పోరాటం,చివరకు సింగరేణికే పీకే–2 డీప్ సైడ్ బ్లాక్. రాష్ట్ర ప్రభుత్వ ఒత్తిళ్లను తిప్పికొట్టిన ఎఐటీయూసీ సింగరేణికి దక్కిన పీకే–2 డీప్ సైడ్ బ్లాక్. మణుగూరు పీకే ఓసి డీప్ సైడ్ బొగ్గు బ్లాకు వేలంపాటలో జెన్కో, సింగరేణి సంస్థలు పోటీ పడగా, చివరకు 6.5 శాతం రెవెన్యూ షేర్తో సింగరేణి దక్కించుకోవడం గుర్తింపు సంఘం ఎఐటీయూసీ చేపట్టిన నిరంతర పోరాటాలు, ఉద్యమాలు, కార్మికుల ఐక్యస్ఫూర్తికి దక్కిన ఘన విజయమని సంఘం రాష్ట్ర అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్కుమార్ పేర్కొన్నారు.సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో వారు మాట్లాడుతూ,మణుగూరు పీకే-2 డీప్ సైడ్ బొగ్గు బ్లాకు విషయంలో జెన్కోను వేలంపాట ప్రక్రియ నుంచి తప్పించాలని ఉద్యమం చేసిన ఏకైక కార్మిక సంఘం ఎఐటియుసి అన్నారు,అంలదేవిధంగా సింగరేణి మాత్రమే వేలంపాటలో పాల్గొనేలా చేసి బ్లాకును సింగరేణికే కేటాయించాలని డిమాండ్ చేసింది, మరియు మణుగూరు పీకే–2 డీప్ సైడ్ బ్లాక్ను సింగరేణికే కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఎఐటీయూసీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు, ధర్నాలు, రాస్తారోకోలు, గనుల వద్ద ఆందోళనలు, వినతిపత్రాల సమర్పణ, నిరసన కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా, అరెస్టులను సైతం లెక్కచేయకుండా ఉద్యమాన్ని నిరంతరం కొనసాగించామని గుర్తు చేశారు.ఆ ఉద్యమాల ఫలితంగానే నేడు సింగరేణి వేలంలో పాల్గొని 6.5 శాతం రెవెన్యూ షేర్తో మణుగూరు పీకే–2 డీప్ సైడ్ బ్లాక్ను దక్కించుకుందని తెలిపారు. ఈ విజయానికి సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖలు, ఎఐటీయూసీ చేపట్టిన ఉద్యమాలు కీలకంగా దోహదపడ్డాయని పేర్కొన్నారు.పీకే–2 డీప్ సైడ్ బ్లాక్ సింగరేణి మనుగడకు ప్రాణాధారమని, వేలాది మంది కార్మికుల ఉపాధి, మణుగూరు ప్రాంత అభివృద్ధి, సింగరేణి సంస్థ భవిష్యత్తు ఈ బ్లాక్పైనే ఆధారపడి ఉందన్నారు.రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడితో మణుగూరు బ్లాక్ను జెన్కో పేరుతో వేలంలో ప్రవేశపెట్టి, చివరకు ప్రైవేట్ కంపెనీలకు అప్పగించేందుకు జరిగిన ప్రయత్నాలను ఎఐటీయూసీ తీవ్రంగా ప్రతిఘటించిందన్నారు "జెన్కో కాదు.సింగరేణికే మణుగూరు డీప్ సైడ్ బొగ్గు బ్లాక్ కేటాయించాలి" అనే నినాదంతో చేపట్టిన ఉద్యమం చివరకు విజయాన్ని సాధించిందని తెలిపారు."సేవ్ సింగరేణి – సేవ్ మణుగూరు" నినాదంతో సాగిన ఈ ఉద్యమం కార్మికుల ఐక్యతకు, సంకల్పానికి ప్రతీకగా నిలిచిందన్నారు.జెన్కోపై పైచేయి సాధిస్తూ సింగరేణి 6.5 శాతం రెవెన్యూ షేర్తో పీకే–2 డీప్ సైడ్ బ్లాక్ను దక్కించుకోవడం ఎఐటీయూసీ ఉద్యమ చరిత్రలో మరో చిరస్మరణీయ విజయమని వాసిరెడ్డి సీతారామయ్య, కొరిమి రాజ్కుమార్ స్పష్టం చేశారు.
Admin
తెలుగు వెలుగు టీవీ