తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం సిఆర్ఎం (కామన్ రివ్యూ మిషన్) బృందం జిల్లా ఆరోగ్య కార్యకలాపాలపై సమీక్షా సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అధ్యక్షత వహించారు. సమావేశంలో జిల్లా ఆరోగ్య వ్యవస్థ, జాతీయ ఆరోగ్య మిషన్ (NHM) కింద అమలవుతున్న వివిధ కార్యక్రమాలు, వైద్య సిబ్బంది పనితీరు, మరియు ప్రజలకు అందిస్తున్న సేవల నాణ్యతపై విస్తృత చర్చ జరిగింది. ఈ సందర్భంగా సిఆర్ఎం బృంద సభ్యులు డా. గురిందర్ బీర్ సింగ్ – అడ్వైజర్ CPC PHC NHSRC మాట్లాడుతూ, జిల్లాలో చేపడుతున్న ఆరోగ్య కార్యక్రమాలు, ముఖ్యంగా మాతా–శిశు ఆరోగ్యం, వ్యాధి నియంత్రణ, గ్రామీణ ఆరగ్య సేవల విస్తరణ, మరియు వైద్య సదుపాయాల మెరుగుదలపై సంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లాలోని ఆరోగ్య సిబ్బంది నిబద్ధతతో పనిచేస్తున్నారని, ఆరోగ్య సేవల నాణ్యత గణనీయంగా మెరుగుపడిందని బృందం అభిప్రాయపడింది. సిఆర్ఎం బృందం జిల్లాలో ఐదు రోజులపాటు పర్యటించి, జిల్లా ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రి (GGH) కొత్తగూడెం, MCH ఈ.రామవరం, ఏరియా ఆసుపత్రి భద్రాచలం, సిహెచ్ సి చర్ల, ఇల్లందు, గుండాల, ఎస్ఎన్పురం, సుజాతనగర్, యుపిహెచ్ సి శేఖర్ బంజరా, రామవరం, ఆయుష్మాన్ ఆరోగ్యం మందిర్ లు లచ్చగూడెం, ముత్తాపురం, నమిడిగూడెం, ధన్బాద్, చాతకొండ, తెగడ, దానవాయిపేట తదితర ఆరోగ్య కేంద్రాలు, అలాగే టీ హబ్ కొత్తగూడెం, సెంట్రల్ మెడిసిన్ స్టోర్, క్రిటికల్ కేర్ బ్లాక్ కొత్తగూడెం కేంద్రాలను సందర్శించి ఆరోగ్య సేవలను పరిశీలించింది. బృంద సభ్యులు తమ పరిశీలన వివరాలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ రూపంలో వివరించారు. వైద్య సిబ్బందికి తరచూ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి, సేవల నాణ్యతను మెరుగుపరచాలని సూచించారు. ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, ఎంఎల్ హెచ్పిలు సమర్థవంతంగా పనిచేస్తున్నారని ప్రశంసించారు. జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ మాట్లాడుతూ , సిఆర్ఎం బృందం చేసిన సూచనలను సత్వరమే అమలు చేయాలని, జిల్లా ఆరోగ్య సేవల నాణ్యతను మరింత బలోపేతం చేయడానికి సంబంధిత అధికారులు కృషి చేయాలని సూచించారు. ప్రజల్లో ఆరోగ్య అవగాహన పెంపు, వైద్య సేవల సులభ ప్రాప్యత, మరియు అన్ని స్థాయిల్లో సమన్వయం కలిగి కార్యక్రమాలు అమలు చేయాలని ఆయన సూచించారు.జిల్లా ఆరోగ్య సిబ్బంది కృషితో జిల్లా ఆరోగ్య వ్యవస్థ మరింత పటిష్టంగా ముందుకు సాగుతుందని, కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల లక్ష్యాలకు అనుగుణంగా ప్రజా ఆరోగ్య పరిరక్షణలో కొత్త ప్రమాణాలు సాధించాలన్నదే లక్ష్యమని కలెక్టర్ తెలిపారు. సిఆర్ఎం బృందంలో, డా. బి. వెంకట శివారెడ్డి – అసిస్టెంట్ ప్రొఫెసర్ AIIMS మంగళగిరి, డా. అజయ్ పాండే – అసిస్టెంట్ ప్రొఫెసర్ PRC లక్నో, డా. అంకిత కాంకర్య – అసిస్టెంట్ ప్రొఫెసర్ PGIMER చండీగఢ్, డా. అనర్ సింగ్ డాకర్ – సీనియర్ కన్సల్టెంట్ NHM పాలసీ MoHFW, మరియు డా. కల్పనా భవానియ – సీనియర్ కన్సల్టెంట్ PHA NHSRC సభ్యులుగా ఉన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ సౌరబ్ శర్మ, జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్. విజయలక్ష్మి, అదనపు జిల్లా వైద్యాధికారి డాక్టర్ సైదులు, డిసిహెచ్ఎస్ డాక్టర్ రవిబాబు, ప్రోగ్రాం అధికారులు డాక్టర్ మధువరన్, డాక్టర్ పుల్లారెడ్డి, డాక్టర్ స్పందన, డాక్టర్ తేజశ్రీ తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ