తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం: భద్రాద్రికొత్తగూడెం జిల్లా కేంద్రం రామవరం పట్టణంలోని మాదిగ సంక్షేమ సంఘం(అంబేద్కర్ భవన్) ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ 68వ వర్ధంతి వేడుకలు. ఈ కార్యక్రమానికి సంఘం జిల్లా నాయకులు సావిటి స్వామి అధ్యక్షత వహించగా అంబేద్కర్ చిత్రపటానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన సిపిఐ జిల్లా కార్యదర్శి కొత్తగూడెం మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఎస్.కె సాబీర్ పాషా పూలమాల తో ఘన నివాళులు అర్పించారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి సాబీర్ పాషా మాట్లాడుతూ అంబేద్కర్ ఆలోచన విధానం ప్రపంచానికి, భారత దేశానికి స్ఫూర్తిదాయకమని ఆయన రచించిన భారత రాజ్యాంగం లోని సెక్యులరిజం ని మనందరం కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు.భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ డిసెంబర్ 6, 1956 లో మరణించడం జరిగిందని ఆయన మరణం యావత్ భారతదేశంలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ లకు తీరని లోటు అని అన్నారు. అనంతరం సాబీర్ పాషా ను సంఘ సభ్యులు ఘనంగా శాలువా తో సత్కరించి సన్మానించారు.ఈ కార్యక్రమంలో మాదిగ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు కొయ్యడ వెంకన్న, జిల్లా కార్యదర్శి సామర్ల సమ్మయ్య, జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి బరిగెల భూపేష్ కుమార్, జిల్లా నాయకులు మాటేటి గోపాల్, మాతాంగి లింగయ్య, గంటాడి కోటేశ్వరరావు, కూరగాయల శ్రీనివాస్, కొత్తూరు మదనయ్య, కంపెల్లీ దుర్గయ్య, చెనిగారపు కుమారస్వామి, సిద్ధల రవి, కొత్తూరు చుక్కయ్య, మాటేటి అంజయ్య, చాట్ల రామారావు,కొత్తూరు రవి, గొర్రె బాబురావు, మద్దికుంట గణేష్, ఇల్లందుల పోచయ్య, ఆవులూరి చంద్రయ్య, జంగం కృష్ణ, పెరిక కిరణ్, నమిల్ల మధు,కె నర్సయ్య,నమిల్ల శేఖర్, తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ