తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం సెప్టెంబర్ 25 (తెలుగు వెలుగు) స్వచ్ఛత హి సేవ 2024 పక్షోత్సవ కార్యక్రమంలో భాగంగా జూలూరుపాడు మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేసి మండలంలోని 24 గ్రామపంచాయతీ లలో పనిచేస్తున్న మల్టీపర్పస్ వర్కర్స్ కు హెల్త్ చెకప్ చేయడం జరిగినది. బిపి, షుగర్, మరియు ఇతర వైద్య పరీక్షలు నిర్వహించారు మండల వైద్యాధికారి డాక్టర్ వెంకటేశ్వర్లు, పీహెచ్సీ సిబ్బంది ఆరోగ్యం పట్ల తగ సూచనలు సలహాలు ఇచ్చారు. కార్యక్రమంలో ఎంపీడీవో కరుణాకర్ రెడ్డి, ఎంపీ ఓ తులసీరామ్, సి హెచ్ ఓ రామకృష్ణ, కృష్ణ హెచ్ ఏ, ఏఎన్ఎం సుశీల, ఆశాలు వసుంధర, శారద పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ