Wednesday, 16 September 2026 05:23:56 AM
# సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ఏజెన్సీ ప్రాంత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత టివిఆర్ చంద్రం.పుస్తకావిష్కరణ సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా. # ప్రభుత్వ లిఖితపూర్వక హామీతోనే ‘చలో హైదరాబాద్’ తాత్కాలిక వాయిదా: TGEJAC ఛైర్మన్ అమరనేని రామారావు. # చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం: టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు.

శ్రీనగర్ పంచాయతీలో మంగళవారం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన.

Date : 18 August 2026 07:11 PM Views : 145

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : మండలం శ్రీనగర్ పంచాయతీలో మంగళవారం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. జంగాల రాజేశ్వరరావు సేవ్ యువర్ లివర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సాయిరామ్ హాస్పిటల్స్ సహకారంతో పంచాయతీ కార్యాలయ ప్రాంగణంలో ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో వివిధ విభాగాలకు చెందిన నిపుణులైన వైద్యులు 117 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వైద్య సలహాలు అందించారు. నెఫ్రాలజీలో 2, ఆర్థోపెడిక్స్‌లో 20, గ్యాస్ట్రో మెడిసిన్‌లో 10, జనరల్ మెడిసిన్‌లో 34, న్యూరో విభాగంలో 2, ఆంకాలజీలో 2, కార్డియాలజీలో 1, మధుమేహ విభాగంలో 24, నేత్ర వైద్యంలో 22 మంది వైద్య సేవలు పొందారు. డాక్టర్ సునీల్ కుమార్ జంగాల (ఎండీ, డీఎం), డాక్టర్ స్వాతి జంగాల (ఎంబీబీఎస్, డి.డయాబ్.) ఆధ్వర్యంలో డా. శ్రావణి, డా. రేణుక తదితర వైద్యులు సేవలందించారు. నర్సులు, ఫార్మసిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఫిజియోథెరపీ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ డైరెక్టర్ సామ్యూల్ గెడ్డం మాట్లాడుతూ... గ్రామీణ ప్రాంతాల ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను ఉచితంగా అందించడమే తమ లక్ష్యమన్నారు. ఇప్పటికే కొత్తగూడెం పరిసర ప్రాంతాల్లో 15కు పైగా ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించామని, భవిష్యత్తులోనూ మరిన్ని శిబిరాలు నిర్వహించి పేద ప్రజలకు అండగా నిలుస్తామని తెలిపారు. గ్రామ సర్పంచ్ బానోత్ రాణి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కోనేరు పూర్ణచంద్రరావు, కోనేరు సత్యనారాయణ, 59వ డివిజన్ కార్పొరేటర్ రావి రాంబాబు, రాజీవ్ యువశక్తి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు వందనపు సూర్యప్రకాశ్‌రావు, ఉపసర్పంచ్, పంచాయతీ వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :