Wednesday, 16 September 2026 09:17:38 AM
# సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ఏజెన్సీ ప్రాంత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత టివిఆర్ చంద్రం.పుస్తకావిష్కరణ సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా. # ప్రభుత్వ లిఖితపూర్వక హామీతోనే ‘చలో హైదరాబాద్’ తాత్కాలిక వాయిదా: TGEJAC ఛైర్మన్ అమరనేని రామారావు. # చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం: టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు.

ప్రకృతిక కవి జయరాజు - మంగతాయి దంపతులకు ఘన సన్మానం

Date : 31 October 2025 06:20 PM Views : 343

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సహజసిద్ధమైన, రోగాలురాని, సువాసనలతో కూడిన ఉత్పత్తులను నిత్యజీవితంలో, కుటుంబ సమేతంగా వాడుకోవాలని సహజ ప్రకృతి కవి, కొత్తగూడెం ప్రకృతి ఆశ్రమం వ్యవస్థాపకులు, కాలోజీ అవార్డు గ్రహీత డాక్టర్. జయరాజు అన్నారు. శుక్రవారం సాయంత్రం స్థానిక బస్టాండ్ సమీపంలో గల "ఉదయం నేచర్ క్యూర్ సెంటర్లో" కుంకుడు కాయల రసంతో తయారుచేసిన ఐదు రకాల ప్రొడక్ట్స్ ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నల్లగొండ జిల్లాలో, అంతర్జాతీయంగా పేరుగాంచిన లోకసాని పద్మా రెడ్డి అనే రైతు ప్రకృతి సహజసిద్ధంగా కుంకుడుగాయలతో అనేక రకాల ప్రొడక్ట్స్ ని తయారు చేస్తున్నారని తెలిపారు. నిజ జీవితంలో మన వాడుకునే అన్ని రకాల ఉత్పత్తులు ఇక్కడ లభిస్తాయని వెల్లడించారు. దీని ద్వారా అనేక రకాల అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చన్నారు. ముఖ్యంగా క్యాన్సర్ లాంటి మహమ్మారిని సైతం ఓడించడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. ప్రకృతి ప్రేమికులందరూ ఈ ఉత్పత్తులను ఉపయోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ప్రకృతి పరిరక్షణ ధ్యేయంగా, నిరంతరం సమాజ సేవలో, ప్రకృతి సేవలో తరిస్తున్న ప్రకృతిక కవి జయరాజు _ మంగతాయి దంపతులను ఆశ్రమం సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రకృతి ఆశ్రమం సభ్యులు స్థానిక ప్రకృతి వైద్యులు సుగుణారావు, రిటైర్డ్ సింగరేణి జిఎం శనగ వెంకటేశ్వర్లు, మనకీ బాత్ మొక్కల రాజశేఖర్, కరాటేలో గిన్నిస్ హోల్డర్ మాటూరు మహావిష్ణుమూర్తి, దయానందసాగర్, బంగారి శంకర్, శోభారాణి, దశరథ్ రజ్వాలు పాల్గొనగా చిన్నారి నైనిక రజ్వా జయరాజు దంపతులకు మొక్కను అందించి అభినందనలు అందుకున్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :