Wednesday, 16 September 2026 09:49:08 PM
# జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్.

మెరుగైన నైపుణ్యాలతోనే యువతకు అవకాశాలు. జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.

Date : 10 January 2026 07:00 PM Views : 200

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం: వృత్తి నైపుణ్యాలను ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకుంటూ పోతేనే యువత తమ భవిష్యత్తును అభివృద్ధి పథంలోకి తీసుకురాగలరని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ తెలిపారు.శనివారం ఐడీఓసీ (IDOC) కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో లెర్నెన్ ప్రైవేట్ లిమిటెడ్ వారిచే ఎంఆర్ఎఫ్ (MRF) ప్రైవేట్ లిమిటెడ్ వారి NAFS స్కీమ్ ద్వారా అప్రెంటిస్‌షిప్ శిక్షణతో పాటు, రేన్ (మద్రాస్) లిమిటెడ్ సంస్థ ద్వారా CNC మిషన్లపై అప్రెంటిస్‌షిప్ మరియు బ్యాచిలర్ / డిప్లొమా ఇన్–వోకేషనల్ కోర్సుల్లో రెండు సంవత్సరాల శిక్షణ కోసం నిర్వహించిన ఓరియెంటేషన్ & సెలక్షన్ ప్రోగ్రామ్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యువతకు అందుబాటులో ఉన్న ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. నైపుణ్యాలు ఉంటేనే ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని, యువతలో స్కిల్ డెవలప్‌మెంట్ పెంపొందించాలనే లక్ష్యంతోనే ఈ శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.ఈ అప్రెంటిస్‌షిప్ శిక్షణలో ఉచిత శిక్షణతో పాటు స్టైపెండ్ సౌకర్యం, 100 శాతం ప్లేస్‌మెంట్ సపోర్ట్ అందిస్తున్నట్లు వివరించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా మల్టీ స్కిల్స్ అవసరమని, యువత నిరంతరం నేర్చుకునే దృక్పథాన్ని అలవర్చుకోవాలని కలెక్టర్ సూచించారు. యువత తమ లక్ష్యాలను సాధించి ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు.ఈ నేపథ్యంలో తన చిన్ననాటి అనుభవాలను కలెక్టర్ గుర్తు చేసుకున్నారు. తాను పేద కుటుంబ నేపథ్యం నుంచి ఎదిగానని తెలిపారు. తన తండ్రి ఐటీఐ చదివారని, కుటుంబంలో పెద్దగా చదువుకున్న వారు ఎవరూ లేరని అన్నారు. తాను ఈ స్థితికి చేరుకోవడానికి ఎన్నో పనులు చేశానని, ఎంతో కష్టపడి చదివి ఈ స్థాయికి చేరుకున్నానని గుర్తు చేసుకున్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు ఉంటాయని, వాటికి భయపడి ఒకేచోట కూర్చుంటే విజయం దక్కదని అన్నారు. కష్టాలను అధిగమించి ఓర్పుతో ముందుకు వెళ్లిన వారే విజయతీరానికి చేరుకుంటారని పేర్కొన్నారు. ఈ అప్రెంటిస్‌షిప్‌లో మంచిగా శిక్షణ తీసుకొని, యువత ఉద్యోగాలను సాధించి జిల్లాకు, తమ గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.ఈ సెలక్షన్ ప్రోగ్రామ్‌కు హాజరుకాలేకపోయిన అభ్యర్థుల కోసం జనవరి 21న మరోసారి ట్రైనింగ్ & సెలక్షన్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సెలక్షన్‌లో ఎంపిక కాలేకపోయినా అభ్యర్థులు నిరాశ చెందకుండా, మరింతగా ప్రిపేర్ అయి భవిష్యత్తులో ఇంకా మంచి అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమానికి మొత్తం 107 మంది యువకులు హాజరుకాగా, వీరిలో 92 మంది తమ వివరాలను నమోదు చేసుకున్నారని తెలిపారు. నమోదు చేసుకున్న అభ్యర్థులకు మౌఖిక పరీక్షలు నిర్వహించి, వారిలో 57 మందిని వివిధ ప్రతిష్ఠాత్మక పరిశ్రమలకు ఎంపిక చేసినట్లు వెల్లడించారు. ఇందులో MRF Ltd. కంపెనీకి 39 మంది, Rane (Madras) Limited కంపెనీకి 14 మంది,టైచి కంపెనీకి 4 మంది యువకులు ఎంపికయ్యారని తెలిపారు.MRF కంపెనీలో శిక్షణ కాలంలో మొదటి సంవత్సరంలో నెలకు రూ.17,500, రెండో సంవత్సరంలో రూ.18,500, మూడో సంవత్సరంలో రూ.19,500 స్టైపెండ్ అందజేయబడుతుందని తెలిపారు. ఇందులో వసతి సౌకర్యం కోసం రూ.1,000, క్యాంటీన్ సదుపాయం కోసం రూ.350, బస్ సౌకర్యం కోసం రూ.500గా మొత్తం రూ.1,850 మినహాయించి మిగిలిన మొత్తాన్ని స్టైపెండ్ రూపంలో యువతకు చెల్లించబడుతుందని వివరించారు.రానే (మద్రాస్) కంపెనీ వారు శిక్షణ కాలంలో మొదటి సంవత్సరంలో నెలకు రూ.15,200, రెండో సంవత్సరంలో రూ.16,200 స్టైపెండ్ అందజేస్తారని, శిక్షణ పూర్తయిన అనంతరం ఎంపికైన యువతకు ప్రారంభ జీతంగా నెలకు రూ.22,000 చెల్లించబడుతుందని జిల్లా కలెక్టర్ తెలిపారు.ఈ కార్యక్రమంలో MRF కంపెనీ సూపర్‌వైజర్ అమృత్ రాజు, రానే మద్రాస్ కంపెనీ నుండి రిక్రూట్‌మెంట్ – అసిస్టెంట్ మేనేజర్ బిస్వజిట్ ఖుంటియా, SERP నుండి బి.నీలయ్య, ఏపిఎం లు ఎల్.వెంకయ్య, జి. ప్రసాద్ రెడ్డి, ఏ. నాగేశ్వర రావు, ఈ.డి.యం కలెక్టరేట్ టెక్నికల్ విభాగం అధికారులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :