తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : అఖండ భారతావని ఏకమవ్వాల్సిన సమయమిది అని, పాక్ ఉగ్రవాదులను తుదముట్టించేందుకు త్రివిధ దళాల వీరోచితంగా యుద్ధం చేస్తున్నాయని జర్నలిస్టు జేఏసీ నాయకులు అన్నారు. శుక్రవారం కొత్తగూడెం పట్టణంలో జర్నలిస్టు జేఏసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు మాట్లాడుతూ పాక్ కవ్వింపు చర్యలను బలంగా తిప్పికొట్టి , మన భూభాగంలో డ్రోన్ లను పంపిన పాక్ ఉగ్రవాదులను భారత్ జవాన్లు సరైన సమాధానం చెప్పారని తెలిపారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ కు ప్రపంచ దేశాలు మద్దతు ఇవ్వవద్దని పిలుపునిచ్చారు. శాంతి సామరస్యంతో జీవిస్తున్న భారతదేశ ప్రజల్లో అలజడి రేపి విచ్ఛిన్నం చేయాలనుకున్న ఉగ్రవాదులను సరైన సమాధానం చెప్పేందుకు ప్రజలు ఈ సమయంలో ఒక్కటిగా వుండాలని, ఆర్మీ కి ఎప్పటికప్పుడు మద్దతివ్వాలని, ప్రభుత్వం చెప్పే సూచనలను ప్రజలు పాటించాలన్నారు. ఉగ్రవాదాన్ని తుదముట్టించడమే భారత లక్ష్యంగా త్రివిధ దళాలు పనిచేస్తున్నాయని తెలిపారు. భారత దేశ ఆర్మీతో యుద్ధం చేయడమంటే కొరివితో తల గొక్కోవడమేనని అనేకసార్లు మన ఆర్మీ నిరూపించిందని ఈ భావోద్వేగ సమయంలో ఆర్మీ చేస్తున్న యుద్ధంలో ప్రతి సైనికుడికి మనం మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుందామని, అందరికి అండగా ఉందామన్నారు . ఈ కార్యక్రమంలో కొత్తగూడెం జర్నలిస్టులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ