Thursday, 02 July 2026 07:09:03 AM
# సింగరేణి గడ్డ మరోసారి పోరాటాల గడ్డగా మారింది. జేఏసీ ఆధ్వర్యంలో కొత్తగూడెం హెడ్ ఆఫీస్ ముట్టడి విజయవంతం.వేలాది కార్మికులతో మార్మోగిన డిమాండ్ల డే. # నేషనల్ హైవే అధికారుల నిర్లక్ష్యం తగదు.కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # కల్యాణ లక్ష్మి, షాదిముబారక్ పథకాలు పేద కుటుంబాలకు కొండంత అండ. కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # అర్హులైన ప్రతి రైతుకు రైతు భరోసా పథకం ప్రయోజనాలు పారదర్శకంగా అందిస్తాం: జిల్లా కలెక్టర్ అంకిత్. # జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ తుకారామ్ రాథోడ్ ఆధ్వర్యంలో పదవీ విరమణ పొందిన వైద్య సిబ్బందికి సన్మానం. # కార్మికుల న్యాయమైన వేతన హక్కులను కాలరాయొద్దు – 12వ వేతన కమిటీని వెంటనే ఏర్పాటు చేయాలి. # వట్టికొండ రజిని జయంతి సందర్భంగా పేదలకు నిత్యావసర సరుకులు, బట్టల పంపిణీ. # నూతన జిల్లా పోలీస్ కార్యాలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీని గడువులోపు పూర్తి చేయాలి : రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుధర్శన్ రెడ్డి. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని రాష్ట్ర పరిశీలక బృందం సందర్శించింది. # ప్రజలకు నిర్విరామంగా సేవలందించిన ఉద్యోగుల సేవలు చిరస్మరణీయం: జిల్లా కలెక్టర్ అంకిత్. # ఓటర్ల జాబితా సవరణలో బిఎల్ఏల పాత్ర కీలకం. బిఎల్ఏల సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # వామపక్ష నాయకుల అక్రమ అరెస్టులు అప్రజాస్వామికం.అరెస్టు చేసిన కూనంనేనిని, ఇతర నేతలను భేషరతుగా విడుదల చేయాలి. # వామపక్ష నాయకుల అక్రమ అరెస్టులు అప్రజాస్వామికం. సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # ఇండ్లు లేని పేదల పక్షాన సమిష్టిగా పోరాడుదాం.సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, సిపిఎం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు. # మొహరం పండుగ త్యాగానికి, సేవకు నిదర్శనం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # తల్లిదండ్రుల మందలించడంతో మనస్తాపం చెంది కొడుకు ఆత్మహత్య. # పద్ధతి మార్చుకోండి లేదంటే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవు రౌడీషీటర్లకు డీఎస్పీ అరుణ్ కుమార్ కౌన్సిలింగ్. # ​ బైక్ అదుపుతప్పి కరెంట్ పోల్‌ను ఢీకొట్టిన ప్రమాదంలో సమ్మయ్య అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి. # ప్రాచీన సంస్కృతీ సాంప్రదాయాలను కాపాడుకుందాం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా.

అఖండ భారతావని ఏకమవ్వాల్సిన సమయమిది

Date : 09 May 2025 06:03 PM Views : 851

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : అఖండ భారతావని ఏకమవ్వాల్సిన సమయమిది అని, పాక్ ఉగ్రవాదులను తుదముట్టించేందుకు త్రివిధ దళాల వీరోచితంగా యుద్ధం చేస్తున్నాయని జర్నలిస్టు జేఏసీ నాయకులు అన్నారు. శుక్రవారం కొత్తగూడెం పట్టణంలో జర్నలిస్టు జేఏసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు మాట్లాడుతూ పాక్ కవ్వింపు చర్యలను బలంగా తిప్పికొట్టి , మన భూభాగంలో డ్రోన్ లను పంపిన పాక్ ఉగ్రవాదులను భారత్ జవాన్లు సరైన సమాధానం చెప్పారని తెలిపారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ కు ప్రపంచ దేశాలు మద్దతు ఇవ్వవద్దని పిలుపునిచ్చారు. శాంతి సామరస్యంతో జీవిస్తున్న భారతదేశ ప్రజల్లో అలజడి రేపి విచ్ఛిన్నం చేయాలనుకున్న ఉగ్రవాదులను సరైన సమాధానం చెప్పేందుకు ప్రజలు ఈ సమయంలో ఒక్కటిగా వుండాలని, ఆర్మీ కి ఎప్పటికప్పుడు మద్దతివ్వాలని, ప్రభుత్వం చెప్పే సూచనలను ప్రజలు పాటించాలన్నారు. ఉగ్రవాదాన్ని తుదముట్టించడమే భారత లక్ష్యంగా త్రివిధ దళాలు పనిచేస్తున్నాయని తెలిపారు. భారత దేశ ఆర్మీతో యుద్ధం చేయడమంటే కొరివితో తల గొక్కోవడమేనని అనేకసార్లు మన ఆర్మీ నిరూపించిందని ఈ భావోద్వేగ సమయంలో ఆర్మీ చేస్తున్న యుద్ధంలో ప్రతి సైనికుడికి మనం మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుందామని, అందరికి అండగా ఉందామన్నారు . ఈ కార్యక్రమంలో కొత్తగూడెం జర్నలిస్టులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :