Friday, 19 June 2026 02:36:48 PM
# టాస్క్ఫోర్స్ మరియు అన్నపురెడ్డి పల్లి పోలీసులు చేపట్టిన వాహన తనిఖీల్లో భారీగా 44.30 లక్షలు విలువైన గంజాయి స్వాధీనం. # కిన్నెరసానిని ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం. కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # ప్రశాంత వాతావరణంలో టీజీ టెట్ పరీక్షలు. జిల్లా కలెక్టర్ అంకిత్ . # జూలూరుపాడు ప్రభుత్వ పాఠశాల నందు సామూహిక అక్షరాభ్యాసం # వైకుంఠ రధం రిపేర్ చేయించి ఉపయోగమునకు తీసుకురావాలి. మేనేజర్ కి వినతి పత్రం అందించిన సిపిఐ జిల్లా నాయకులు మునిగడప వెంకటేశ్వర్లు. # ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మరమ్మత్తు పనులు త్వరితగతిన పూర్తి చేయాలి – జిల్లా కలెక్టర్ అంకిత్. # అర్హుల గుర్తింపులో పారదర్శకత పాటించాలి – జిల్లా కలెక్టర్ అంకిత్. # ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించే బాధ్యత ఎంఈఓలదే – జిల్లా కలెక్టర్ అంకిత్. # రాష్ట్రంలో బిజెపి జెండా ఎగిరేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి - విలేకరుల సమావేశంలో ఉదయ్ ప్రతాప్, బైరెడ్డి. # పారిశుద్ధ్య కార్మికుడు శేషు అకాల మరణం అత్యంత బాధాకరం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, మేయర్ మూడ్ గణేష్. # ముఖ్యమంత్రి పంపిన లేఖ, పుష్పగుచ్ఛం అందుకోవడం సంతోషకరం. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # కొత్తగూడెంలో మణుగూరు సూపర్ ఫాస్ట్ రైలు కింద పడి వ్యక్తి మృతి. # వెంకటయ్య మృతి పార్టీకి తీరని లోటు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండండి - ఎస్బీఐ రీజినల్ మేనేజర్ పీజీఎన్ శర్మ. # ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో అధిక ఫీజుల వసూళ్లను తక్షణమే నియంత్రించాలి. ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎస్కే షాహిద్, వరక అజిత్. # అమృత్ పథకం నిధులతో వేగవంతంగా సాగుతున్న నీటి పథకాల నిర్మాణ పనులు. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మిత్రుడి కుటుంబానికి అండగా నిలిచిన పూర్వ విద్యార్థులు. # సాధారణ ప్రసవాలను పెంచాలి – మాతృ, శిశు మరణాలను తగ్గించాలి. జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డా. తుకారాం రాథోడ్. # జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు పటిష్టంగా అమలు చేయాలి. Dr తుకారాం రాథోడ్ DMHO. # గుడిపాడు యూపీహెచ్‌సీని సందర్శించిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. తుకారాం రాథోడ్.

పౌష్టికాహారంతో పాటు నాణ్యమైన విద్య అందించడమే మా లక్ష్యం : జిల్లా సంక్షేమ అధికారిని స్వర్ణలత లేనినా

Date : 18 June 2026 04:52 PM Views : 10

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : పాల్వంచ ప్రాజెక్టు, లక్ష్మీదేవిపల్లి సెక్టార్, ఇంద్రానగర్ అంగన్వాడి కేంద్రం నందు "అమ్మమాట అంగనవాడి బాట" కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన జిల్లా సంక్షేమ అధికారిని జె.స్వర్ణలత లేనినా మాట్లాడుతూ అంగన్వాడి కేంద్రాలలో నమోదు అయ్యే లబ్ధిదారులకు పౌష్టిక ఆహారంతో పాటు నాణ్యమైన విద్యను అందించాలని, ఈ యొక్క "అమ్మ మాట అంగనవాడి బాట" కార్యక్రమంలో భాగంగా అంగన్వాడీ కేంద్రాలలో అందిస్తున్న సేవలపై విస్తృత ప్రచారం నిర్వహించి లబ్ధిదారుల సంఖ్య పెరిగే విధంగా ప్రతి ఒక్క అంగన్వాడీ టీచర్ కృషి చేయాలని తెలిపారు. మొదటి 1000 రోజుల తల్లి బిడ్డల సంరక్షణ ధ్యేయంగా ప్రతి అంగనవాడి కేంద్రంలో పూర్వ ప్రాథమిక విద్య, ఆటపాటలతో కూడిన విద్యను అందించడం, అంగన్వాడి కేంద్రాలలో పెరటి తోట పెంపకం ద్వారా వచ్చే రాబడిని నమోదైన లబ్ధిదారులకు అందజేయాలని, జిల్లాలో ఏ ఒక్క అంగన్వాడి కేంద్రాలలో తీవ్ర పోషణ లోపం, అతి తీవ్ర పోషణ లోపంతో బాధపడే వారి సంఖ్య తగ్గించే వరకు అంగనవాడి టీచర్లు అహర్నిశలు కష్టపడాలని, ప్రతి నెల క్రమం తప్పకుండా పిల్లల ఎత్తు బరువులు చూచి వారి ఆరోగ్య సంరక్షణ కోసమై వైద్య ఆరోగ్యశాఖ సమన్వయంతో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఆరోగ్య తెలంగాణ నిర్మాణానికి భాగస్వాములు కావాలని కోరారు. ఈ అమ్మ మాట అంగనవాడి బాట కార్యక్రమంలో భాగంగా జిల్లా సంక్షేమ అధికారిని మరియు స్థానిక సర్పంచ్ ద్వారా లక్ష్మీదేవిపల్లి సెక్టర్ లో అంగన్వాడీ కేంద్రాలలో నమోదైన చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసం తో పాటు, నాణ్యతతో కూడిన యూనిఫామ్లు, విద్యారంభం సర్టిఫికెట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్వంచ ప్రాజెక్టు సిడిపిఓ లక్ష్మీప్రసన్న, శ్రీనగర్ పంచాయతీ సర్పంచ్ రాణి, లక్ష్మీదేవిపల్లి సెక్టార్ సూపర్వైజర్ రమాదేవి, నేషనల్ న్యూట్రిషన్ మిషన్ జిల్లా సమన్వయకర్త సంపత్, మహిళా సాధికారిత జిల్లా కోఆర్డినేటర్ రూప సంతోషి, అంగన్వాడీ టీచర్లు హెల్పర్లు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :