తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జూలూరుపాడు మండల పరిధి పడమట నర్సాపురం లోని శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ ఆలయంలో సేవాలాల్ 287వ జయంతి వేడుకలను అధికారికంగా శుక్రవారం ఘనంగా నిర్వహించారు. సేవాలాల్ జయంతి వేడుకలలో వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జయంతి వేడుకలకు విచ్చేసిన ఎమ్మెల్యే కి ఆలయ కమిటీ స్వాగతం పలికారు అనంతరం సాంప్రదాయ బంజారా నృత్యంలో మహిళలలు ఆటపాటలతో అలరించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ సంత్ సేవాలాల్ మహారాజ్ కేవలం గిరిజనుల ఆరాధ్య దైవం మాత్రమే కాదని, అందరికీ ఆరాధ్యుడేనని అన్నారు. గిరిజనులకు దశ-దిశను చూపి, హైందవ ధర్మం గొప్పదనం, విశిష్టతలను తెలియ జేయడానికే సేవాలాల్ మహారాజ్ జన్మించారని చరిత్రకారులు చెబుతారని తెలిపారు. బంజారా జాతి ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటేలా అహింసా సిద్ధాంతానికి పునాదులు వేశారని వెల్లడించారు. దీంతో శ్రీ సంత్ సేవాలాల్ ఇతర కులాల వారికి కూడా ఆదర్శ మూర్తిగా నిలిచారని పేర్కొన్నారు. ప్రతీ ఒక్కరూ మన సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సంఘం లక్ష్మీ కుమారి, కాంగ్రెస్ నాయకులు లేళ్ళ వెంకటరెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు మంగీలాల్ నాయక్, లచ్చు నాయక్, మహిళా అధ్యక్షురాలు ప్రియాంక, ఓబీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు అల్లడి నరసింహారావు, నవీన్ రాథోడ్, మధుసూదనరావు, పొన్నెకంటి సతీష్ కుమార్, లేళ్ళ అప్పిరెడ్డి, కాజా రమేష్, లేళ్ళ గోపాలరెడ్డి రామిరెడ్డి, నాగ శ్రీనివాసరావు, ఆర్కె నాయుడు, ఆలయ కమిటీ చైర్మన్ బాదావత్ వెంకట్ రామ్, మాన్ సింగ్, రాంకోటి, అధికారులు ఎంపీడీఓ అజయ్, ఏఓ దీపక్ ఆనంద్, ఆర్ఐ ఆదినారాయణ, సీఐ శ్రీలక్ష్మి, ఎస్సై రవి, కార్యదర్శి బి హారిక తోపాటు, వివిధ గ్రామ పంచాయతీల సర్పంచులు, పార్టీ శ్రేణులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ