తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం అక్టోబర్ 24 (తెలుగు వెలుగు) జూలూరుపాడు మండల పరిధిలోని ఇటీవల రాచబండ్ల కోయగూడెం గ్రామానికి చెందిన, కుంజా ప్రవీణ్ కుమార్ మరియు మల్కం గంగయ్య అను ఇరువురు తేదీ 21.10. 2024 తమ గ్రామానికి చెందిన కుంజ బిక్షం అను అతనిని ఇంట్లో నుండి గ్రామ శివారునగల వేపల వద్దకు తీసుకెళ్లి, మంత్రాలు నేర్చుకొని, చేతబడి చేస్తున్నాడనే అనుమానంతో విచక్షణారహితంగా కొట్టి, చంపేసి వాగులో పడేసినారు.అట్టి హత్య గురించి మృతుడి సోదరుడు అర్జున్ రావు ఫిర్యాదు ఇవ్వగా జూలూరుపాడు పోలీస్ స్టేషన్ ఎస్ఐ రాణా ప్రతాప్ కేసు నమోదు చేసినారు. కేసు దర్యాప్తులో భాగంగా ఇంద్రసేనారెడ్డి సమగ్ర విచారణ మరియు దర్యాప్తు జరిపి నిందితులైన పైన పేర్కొన్న ఇరువురిని రిమాండ్ నిమిత్తం కొత్తగూడెం కోర్టు నందు హాజరపరిచినారు.
Admin
తెలుగు వెలుగు టీవీ