Sunday, 02 August 2026 04:55:01 AM
# సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్: ₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం. # ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో స్కార్ఫ్ డే # సుజాత నగర్, బాలాజి నగర్ ల్లో వీధి కుక్కల బెడత. # జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకోండి – పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించండి. # నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ & పీఎం) కిరణ్ కుమార్‌కు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు. # భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు, ERO రవికుమార్. # 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం. # ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు, బిఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి . # 50 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్. # సారపాక,రెడ్డిపాలెం, తూర్పాక,దుమ్ముగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # తాటి సురేష్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా, కోమరి కృష్ణ సన్మానం. # భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మేరా యువ భారత్, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఘనంగా ముగిసిన 8 రకాల జిల్లాస్థాయి పోటీలు. # ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం. # గోదావరి వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # 16వ డివిజన్లో నూతన కాలువ నిర్మాణ పనులు ప్రారంభం.కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘన సన్మానం. # కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై సమరశంఖం పూరించాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

అశ్వాపురంలో ఆదివాసీ మహిళల పట్ల ఫారెస్ట్ అధికారుల ప్రవర్తన దుర్మార్గమైన చర్య – బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి డా. వెంకన్న నాయక్.

Date : 18 July 2026 07:16 PM Views : 373

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వాపురం మండలం, మనుబోతులపాడు గ్రామపంచాయతీ పరిధిలో ఆదివాసీ మహిళలతో ఫారెస్ట్ అధికారులు దురుసుగా ప్రవర్తించినట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయని భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి డా. వెంకన్న నాయక్ పేర్కొన్నారు. ఆదివాసీ మహిళల గౌరవం, భద్రత, రాజ్యాంగబద్ధ హక్కులు మరియు ప్రజాస్వామ్య విలువలపై జరిగిన ఈ ఘటనను అత్యంత తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి మహిళ గౌరవప్రదంగా జీవించే హక్కు కలిగి ఉందని, ముఖ్యంగా ఆదివాసీ మహిళల పట్ల అధికార యంత్రాంగం అత్యంత సున్నితంగా, మానవీయంగా వ్యవహరించాల్సిన బాధ్యత ఉందని ఆయన స్పష్టం చేశారు.ఈ ఘటనపై తెలంగాణ ప్రభుత్వం వెంటనే నిష్పక్షపాత విచారణ చేపట్టి, వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకురావాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తోందన్నారు. విచారణలో అధికార దుర్వినియోగం జరిగినట్లు తేలితే, బాధ్యులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.మహిళల గౌరవాన్ని, ఆదివాసీల హక్కులను కాపాడటం ప్రభుత్వ యంత్రాంగం యొక్క రాజ్యాంగబద్ధ బాధ్యత అని పేర్కొన్న ఆయన, ప్రజలకు రక్షణ కల్పించాల్సిన వ్యవస్థే ప్రజల్లో భయాందోళనలు సృష్టించే పరిస్థితి రావడం అత్యంత విచారకరమని అన్నారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టే విధంగా ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.ఈ అంశాన్ని నేషనల్ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోతు హుస్సేన్ నాయక్ గారి దృష్టికి తీసుకెళ్లి, బాధ్యులైన అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకునేలా భారతీయ జనతా పార్టీ పోరాటం కొనసాగిస్తుందని డా. వెంకన్న నాయక్ ఈ సందర్భంగా తెలిపారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :