Wednesday, 16 September 2026 04:44:41 AM
# సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ఏజెన్సీ ప్రాంత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత టివిఆర్ చంద్రం.పుస్తకావిష్కరణ సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా. # ప్రభుత్వ లిఖితపూర్వక హామీతోనే ‘చలో హైదరాబాద్’ తాత్కాలిక వాయిదా: TGEJAC ఛైర్మన్ అమరనేని రామారావు. # చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం: టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు.

బీజేపీ పోరాట ఫలితమే 76 జీవో అమలు

Date : 12 September 2026 05:29 PM Views : 131

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : 76 జీవో అమలు చేసి అర్హులైన పేదలకు ఇంటి పట్టాలు అందించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన పోరాటానికి ఫలితం లభించిందని బీజేపీ కొత్తగూడెం పట్టణ అధ్యక్షుడు శీలం విద్యాసాగర్ అన్నారు. ఈ అంశంపై అసెంబ్లీ సాక్షిగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పందిస్తూ 76 జీవోను అమలు చేస్తామని, ఈ నెల చివరిలోపు అర్హులైన వారికి ఇంటి పట్టాలు అందిస్తామని హామీ ఇవ్వడం పట్ల బీజేపీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ పట్టణ అధ్యక్షుడు శీలం విద్యాసాగర్ మాట్లాడుతూ, “ప్రజా సమస్య ఏదైనా బీజేపీ పార్టీ ప్రజల పక్షాన ముందుండి పోరాటం చేస్తుందని,76 జీవో అమలు కోసం బీజేపీ చేసిన పోరాటం వల్ల ప్రభుత్వం స్పందించి అసెంబ్లీ సాక్షిగా హామీ ఇవ్వడం ప్రజా పోరాట విజయానికి నిదర్శనం” అని అన్నారు. ఇంటి పట్టాల కోసం ఎదురుచూస్తున్న అర్హులైన పేదలకు ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఈ నెల చివరిలోపు పట్టాలు అందించాలని ఇంకా పట్టా కోసం దరఖాస్తు చేసుకునే అటువంటి వారికి మరొక అవకాశం కల్పిస్తూ ఈ యొక్క ప్రక్రియలో స్థానిక ప్రజా ప్రతినిధుల చేతివాటం లేకుండా అధికారులు తగు జాగ్రత్తలు తీసుకుంటూ అర్హులైన వారు నష్టపోకుండా ఈ ప్రక్రియలో ఎలాంటి జాప్యం లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు నోముల రమేష్, ఆదిముల రాములు, కనుకుంట్ల రాజమొగిలి, కొత్తూరు శ్రీనివాస్, పట్టణ ప్రధాన కార్యదర్శులు కలంకార్ రాజశేఖర్, చంద్రగిరి రమేష్, పట్టణ నాయకులు భాస్కర్ గౌడ్, గిరి, హృదయ్, రాజేష్, లలిత్ తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :