తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : అఖిల భారత యాదవ మహాసభ కొత్తగూడెం పట్టణ కమిటీ, యువజన కమిటీ ఆధ్వర్యంలో పట్టణంలోని యాదవ పెద్దల సమక్షంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగ సీతారాములు యాదవ్ హాజరయ్యారు. ఆయనకు కొత్తగూడెం యాదవ బంధుమిత్రులు ఘన స్వాగతం పలికారు. కొత్తగూడెం మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ వేల్పుల దామోదర్ యాదవ్ కూడా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన పట్టణ, యువజన కమిటీల సభ్యులు, యాదవ కుల పెద్దలు సమావేశమై యాదవులకు అవసరమైన మౌలిక వసతులు, సామాజిక అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలను నాగ సీతారాములు యాదవ్ దృష్టికి తీసుకెళ్లారు. సమస్యలను స్థానిక ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుతో చర్చించి, ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని నాగ సీతారాములు హామీ ఇచ్చారు. నూతనంగా ఎన్నికైన రెండు కమిటీల సభ్యులను ఆయన, వేల్పుల దామోదర్ యాదవ్ అభినందించారు. కార్యక్రమంలో పట్టణ గౌరవాధ్యక్షుడు కౌడగాని శ్రీనివాస్ యాదవ్, పట్టణ అధ్యక్షుడు చిలక రవి యాదవ్, వేల్పుల కుమార్ యాదవ్, అంబుల వేణు యాదవ్, బొమ్మిడి రమాకాంత్ యాదవ్, ఆవాల శ్రీనివాస్ యాదవ్, సకినాల సమ్మయ్య యాదవ్, కోదాడ శ్రీనివాస్ యాదవ్, బొమ్మిడి శ్రీకాంత్ యాదవ్, జడల నాని యాదవ్తో పాటు పలువురు యాదవ పెద్దలు, యువత నాయకులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ