Wednesday, 16 September 2026 06:52:43 AM
# సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ఏజెన్సీ ప్రాంత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత టివిఆర్ చంద్రం.పుస్తకావిష్కరణ సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా. # ప్రభుత్వ లిఖితపూర్వక హామీతోనే ‘చలో హైదరాబాద్’ తాత్కాలిక వాయిదా: TGEJAC ఛైర్మన్ అమరనేని రామారావు. # చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం: టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు.

యాదవుల మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి

Date : 24 August 2026 03:52 PM Views : 250

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : అఖిల భారత యాదవ మహాసభ కొత్తగూడెం పట్టణ కమిటీ, యువజన కమిటీ ఆధ్వర్యంలో పట్టణంలోని యాదవ పెద్దల సమక్షంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా టీపీసీసీ జనరల్‌ సెక్రటరీ నాగ సీతారాములు యాదవ్‌ హాజరయ్యారు. ఆయనకు కొత్తగూడెం యాదవ బంధుమిత్రులు ఘన స్వాగతం పలికారు. కొత్తగూడెం మున్సిపల్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ వేల్పుల దామోదర్‌ యాదవ్‌ కూడా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన పట్టణ, యువజన కమిటీల సభ్యులు, యాదవ కుల పెద్దలు సమావేశమై యాదవులకు అవసరమైన మౌలిక వసతులు, సామాజిక అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలను నాగ సీతారాములు యాదవ్‌ దృష్టికి తీసుకెళ్లారు. సమస్యలను స్థానిక ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుతో చర్చించి, ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని నాగ సీతారాములు హామీ ఇచ్చారు. నూతనంగా ఎన్నికైన రెండు కమిటీల సభ్యులను ఆయన, వేల్పుల దామోదర్‌ యాదవ్‌ అభినందించారు. కార్యక్రమంలో పట్టణ గౌరవాధ్యక్షుడు కౌడగాని శ్రీనివాస్‌ యాదవ్‌, పట్టణ అధ్యక్షుడు చిలక రవి యాదవ్‌, వేల్పుల కుమార్‌ యాదవ్‌, అంబుల వేణు యాదవ్‌, బొమ్మిడి రమాకాంత్‌ యాదవ్‌, ఆవాల శ్రీనివాస్‌ యాదవ్‌, సకినాల సమ్మయ్య యాదవ్‌, కోదాడ శ్రీనివాస్‌ యాదవ్‌, బొమ్మిడి శ్రీకాంత్‌ యాదవ్‌, జడల నాని యాదవ్‌తో పాటు పలువురు యాదవ పెద్దలు, యువత నాయకులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :