తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.గ్రేవ్, ప్రాపర్టీ కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలి.బూర్గంపాడు పోలీస్ స్టేషన్ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్.వార్షిక తనిఖీలలో భాగంగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ బూర్గంపాడు పోలీస్ స్టేషన్ను సందర్శించారు. ఈ సందర్భంగా పాల్వంచ డిఎస్పి ఆర్ సతీష్ కుమార్ ఘన స్వాగతం పలికారు. అనంతరం పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించి పలు సూచనలు చేశారు.పోలీస్ స్టేషన్ పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. వివిధ సమస్యలతో పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితులతో మర్యాదగా వ్యవహరిస్తూ సమస్యలకు పరిష్కారం చూపే విధంగా బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని తెలిపారు. పోలీస్ స్టేషన్లోని వివిధ వర్టికల్స్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది పనితీరును అడిగి తెలుసుకున్నారు.అనంతరం పోలీస్ స్టేషన్లో నమోదైన UI కేసులు, గ్రేవ్ కేసులు, ప్రాపర్టీ కేసుల వివరాలను సమీక్షించారు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కేసుల దర్యాప్తును వేగవంతం చేసి, ప్రతి కేసును నాణ్యతతో దర్యాప్తు చేసి సత్వర పరిష్కారం చూపాలని ఆదేశించారు.ప్రాపర్టీ, దొంగతనం కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలని, నిందితులను గుర్తించి అరెస్ట్ చేయడంతో పాటు చోరీకి గురైన ఆస్తిని రికవరీ చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని తెలిపారు. కేసుల దర్యాప్తులో భాగంగా గత నేర చరిత్ర కలిగిన వ్యక్తుల కదలికలపై నిరంతరం నిఘా ఉంచాలని సూచించారు.పోలీస్ స్టేషన్లో నిర్వహిస్తున్న స్టేషన్ రికార్డులను పరిశీలించి పలు సూచనలు చేశారు. సీసీటీఎన్ఎస్ 2.0లో కేసుల వివరాలను సక్రమంగా నమోదు చేసి, ఈ-సాక్ష్య, నాట్గ్రిడ్, గాండీవ వంటి ఆధునిక సాంకేతిక వ్యవస్థలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని తెలిపారు.పోలీస్ స్టేషన్ పరిధిలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై నిరంతరం నిఘా ఉంచి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గంజాయి అక్రమ రవాణా, వినియోగాల పై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. యువత మాదకద్రవ్యాల బారిన పడకుండా విస్తృతంగా అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకొని సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ, వారి సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా పోలీస్ స్టేషన్ ఆవరణలో అధికారులు, సిబ్బందితో కలిసి మొక్కలను నాటారు.ఈ కార్యక్రమంలో పాల్వంచ డిఎస్పి ఆర్ సతీష్ కుమార్, సీఐ సతీష్, ఎస్సైలు ఎం ప్రసాద్, రామ్మూర్తి పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ