తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జూలూరుపాడు; జూలై 11. ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేయాలని , జాబ్ క్యాలెండర్ ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ AIYF జిల్లా సమితి పిలుపులో భాగంగా జూలూరుపాడులో శుక్రవారం ఏఐవైఎఫ్ మండల సమితి ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం ముందు కళ్ళ కు గంతలు కట్టుకొని మోకాళ్ళపై నిరసన తెలియజేశారు.ఈ సందర్భంగా AIYF జిల్లా సహాయ కార్యదర్శి ఎస్కే చాంద్ పాషా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు గడుస్తున్న తరుణంలో ఉద్యోగ నోటిఫికేషన్ లు విడుదల చేయకుండా కాలయాపన చేస్తుందని , గత ప్రభుత్వంలో ఉద్యోగ అవకాశాలు లేక నిరుద్యోగులు తీవ్ర స్థాయిలో నష్టపోయారని , గత పాలకుల లాగా కాకుండా ప్రభుత్వం ఆలోచించి ఉద్యోగ నోటిఫికేషన్లు భర్తీ చేయాలని కోరారు , రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం నిరుద్యోగులకు నిరుద్యోగ భృతిని ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా సమితి సభ్యులు పసుపులేటి పవన్, చాపలమడుగు హర్షవర్ధన్, జస్వంత్, రుషి, సంపత్ వెంకట్ యాకుబ్ పాషా సుమన్ వెంకటేష్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ