Monday, 03 August 2026 04:29:52 PM
# సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్: ₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం. # ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో స్కార్ఫ్ డే # సుజాత నగర్, బాలాజి నగర్ ల్లో వీధి కుక్కల బెడత. # జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకోండి – పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించండి. # నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ & పీఎం) కిరణ్ కుమార్‌కు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు. # భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు, ERO రవికుమార్. # 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం. # ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు, బిఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి . # 50 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్. # సారపాక,రెడ్డిపాలెం, తూర్పాక,దుమ్ముగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # తాటి సురేష్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా, కోమరి కృష్ణ సన్మానం. # భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మేరా యువ భారత్, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఘనంగా ముగిసిన 8 రకాల జిల్లాస్థాయి పోటీలు. # ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం. # గోదావరి వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # 16వ డివిజన్లో నూతన కాలువ నిర్మాణ పనులు ప్రారంభం.కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘన సన్మానం. # కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై సమరశంఖం పూరించాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

మహిళల భద్రత ప్రధాన లక్ష్యం. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో గ్రామ సభలు.

Date : 06 June 2026 08:07 PM Views : 118

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ఆదేశాల మేరకు ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లాలోని వివిధ ప్రాంతాలలో అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది. సుజాతనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సింగభూపాలెం, పాత అంజనాపురం, కొత్త అంజనాపురం, కొత్తగూడెం టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని 4 ఇంక్లైన్, 3 ఇంక్లైన్, ప్రశాంతినగర్, జూలూరుపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో గల గుండెపూడి, ఏడుల్ల బయ్యారం పోలీస్ స్టేషన్ పరిధిలో గల సింగిరెడ్డిపల్లి, పాత రెడ్డిపాలెం మరియు మణుగూరు మునిసిపాలిటీ, భద్రాచలం గ్రామపంచాయతీలలో గ్రామసభలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రజలకు మహిళల భద్రత, మహిళలు మరియు చిన్నారులపై జరిగే నేరాలు, మహిళలకు సంబంధించిన చట్టాలు మరియు సెక్షన్లు, మహిళల సంక్షేమ పథకాలు, పోక్సో చట్టం, షీ బాక్స్ వినియోగం, టి సేఫ్ వినియోగం, షీ టీమ్స్ మరియు భరోసా సెంటర్లో పాత్ర, బాల్య వివాహాల నివారణ, సైబర్ నేరాలు పట్ల, రోడ్డు భద్రత మరియు మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కల్పించడం జరిగింది.అత్యవసర పరిస్థితిలలో చేయవలసిన టోల్ ఫ్రీ నెంబర్లు మహిళా భద్రత విభాగం హెల్ప్ లైన్ నెంబర్ 181, సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్ 1930, చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్ 1098, అత్యవసర సేవల నెంబర్ 112 లపై ప్రజలకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు, సిబ్బంది, గ్రామపంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు, అంగన్వాడి ఉపాధ్యాయులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :