తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : మన డివిజన్ అభివృద్దే మన ధ్యేయం - మునిగడప పద్మ కొత్తగూడెం (కార్పొరేషన్) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా డ్వాక్రా మహిళలు, మున్సిపల్ సిబ్బంది, అధికారులు ప్రజలు పాల్గొని ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా 16వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మున్ముందు రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని ,సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఈ సీజన్లో పరిశుభ్రత కార్యక్రమాన్ని వారం రోజులపాటు ఏర్పాటు చేసుకొని మనం పరిసర ప్రాంతాలను శుభ్రం చేసుకోవాలని ప్రభుత్వ ఇచ్చిన కార్యక్రమాన్ని మనమందరం పాల్గొని మన 16 వ డివిజన్లో సీజనల్ వ్యాధుల రహిత డివిజన్ గా మనం ప్రకటించుకోవాలని ఆమె ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు .99 రోజులపాటు ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక నిర్వహించబడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో శానిటేషన్, పరిశుభ్రత- పచ్చదనం తో పాటుగా డివిజన్ అభివృద్ధి కార్యక్రమాలు కూడా ప్రభుత్వం చేపడుతుందని వివరించారు. కార్యక్రమంలో డివిజన్ ఆఫీసర్ శివరాం, జవాన్ ప్రభుదాసు, ఆర్పీలు మేడిపల్లి కవిత ,బానోతు జానకి ,మరియు ఓబీలు, డాక్రా మహిళ సంఘాల సభ్యులు, డివిజన్ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ