Thursday, 17 September 2026 09:47:11 PM
# మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవకార్యక్రమం # శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి.

మహోన్నత వ్యక్తిత్వం గల మహా నాయకుడు తుమ్మల, తుమ్మల తో జర్నలిస్టుల అనుబంధం మరువలేనిది - సీనియర్ జర్నలిస్ట్ మోటమర్రి రామకృష్ణ

Date : 12 May 2026 12:57 PM Views : 235

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఖమ్మం జిల్లాను విశేషంగా అభివృద్ధి చేసిన మహోన్నత వ్యక్తిత్వం గల మహా నాయకుడు రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అని, ఆయనతో జర్నలిస్టుల అనుబంధం మరువలేనిదని సీనియర్ జర్నలిస్ట్ మోటమర్రి రామకృష్ణ స్పష్టం చేశారు. 1984 నుంచి ఖమ్మం జిల్లా కేంద్రంలో పనిచేసిన జర్నలిస్టులందరికీ తుమ్మల నాగేశ్వరరావు సుపరిచితులని, ఆయనకు జర్నలిస్టుల పట్ల ఎంతో గౌరవభావం ఉండేదని తెలిపారు.1985 అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అప్పటి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎన్టీ రామారావు సత్తుపల్లి వచ్చి ప్రజాసేవ చేయాలనే సంకల్పం గల విద్యావంతుడైన యువకుడిని తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎంపిక చేశానని, ప్రజలు తప్పనిసరిగా గెలిపించాలని కోరుతూ తుమ్మల నాగేశ్వరరావును నియోజవర్గ ప్రజలకు పరిచయం చేశారన్నారు.ఆ సన్నివేశం ఎప్పటికీ మరువలేనిదని తెలిపారు. అప్పటి నుంచి ఆయన తనకు బాగా తెలుసునని ఆ మధుర జ్ఞాపకాలను రామకృష్ణ నెమరువేసుకున్నారు. ప్రజాసేవయే పరమావధిగా రాజకీయాలలో ప్రవేశించి, ఉన్నత శిఖరాలను అధిరోహించి, ప్రజల సంక్షేమానికి, జిల్లా అభివృద్ధికి పథకాలను,కార్యక్రమాలను చేపట్టిన తుమ్మల అభినందనీయుడని ప్రశంసించారు.1986 నుంచి నేటి వరకు నాలుగు సార్లు రాష్ట్ర మంత్రిగా బాధ్యతలను స్వీకరించి ఎన్నో ప్రజాహిత కార్యక్రమాలను చేపట్టి ప్రజల హృదయాలలో చెరగని ముద్రవేశారని ఆయన కొనియాడారు. నిజాయితీకి ప్రతిరూపంగా తుమ్మల ప్రజలలో పేరు పొందారని, అన్ని వర్గాల ప్రజల ఆదరాభిమానాలతో నాలుగు దశాబ్దాల పాటు ప్రజలకు విశేష సేవలు అందించారని, ఎన్నో విజయాలను సాధించిన ఆయన రాజకీయ ప్రస్థానం అందరికీ స్ఫూర్తిదాయకమని స్పష్టం చేశారు. గతంలో ఖమ్మం జిల్లాలోని మారుమూల గిరిజన ప్రాంతంలో గల గుండాల మండలాన్ని అభివృద్ధి చేసిన ఘనత తుమ్మలకే దక్కుతుందని తెలిపారు. ఖమ్మం, కొత్తగూడెం లలో జర్నలిస్టుగా పనిచేస్తున్న సందర్భంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎన్నో కార్యక్రమాలకు, సమావేశాలకు తాను హాజరయ్యానని, ఆ రోజులు ఎప్పటికీ మరువలేనివని పేర్కొన్నారు. జర్నలిస్టుగా తనకు ఆయనంటే ఎంతో గౌరవం అని, మానవత్వం తొణికిసలాడే హృదయం ఉన్న సహృదయుడు తుమ్మల అని కొనియాడారు. కాలగమనంలో నాలుగు దశాబ్దాలు గడిచిపోయినా అప్పట్లో ఖమ్మంలో నాగేశ్వరరావు చెరగని ముద్ర వేశారని అది నేటికీ స్ఫూర్తినిస్తోందని తెలియజేశారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 40 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా నిష్కళంక ప్రజానాయకుడైన రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో ప్రజలకు విశేషంగా సేవ చేయుటకు ఆయనకు నిండు నూరేళ్లు ఆయురారోగ్యములను ప్రసాదించాలని దేవున్ని ప్రార్థిస్తున్నానని తెలిపారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :