తెలుగు వెలుగు టీవీ - వార్తలు / హైదరాబాదు : మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్రం వర్కింగ్ ప్రెసిడెంట్ చల్ల హరి శంకర్ ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర అధ్యక్షులు కొండ దేవయ్య అనుమతితో హైదరాబాదులో జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశంలో ఈ క్రింది ఎజెండా అంశాలను తీర్మానం చేస్తూ ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది 1.మున్నూరు కాపు కార్పోరేష కు సంవత్సరానికి 2000 కోట్ల నిధులు కేటాయించాలని . 2 . 33 జిల్లా కేంద్రములో 2 ఎకరముల భూమి బాల బాలికల హాస్టల భవన నిర్మాణం కొరకు 5 కోట్లు నిధులు ఇవ్వాలని . 3 . కోకాపేట మున్నూరు కాపు ఆత్మ గౌరవ భవన నిర్మాణం కొరకు 20 కోట్లు నిధులు ఇవ్వాలని . 4 . మంత్రివర్గ విస్తరణలో మున్నూరు కాపు ఎమ్మెల్యేల కానీ ఎమ్మెల్సీ గాని మంత్రి పదవి ఇవ్వాలని . 5. ప్రభుత్వ నామినేటు పదవిలలో మున్నూరు కాపు నాయకులకు అవకాశలు కలిపించాలి 6. బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ చేసిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని డిమాండ్ చేస్తూ తీర్మానించనైనది ఈ కార్యక్రమంలో స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ బాపట్ల మురళి . 33 జిల్లాల మున్నూరు కాపు అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రాష్ట్ర కార్యవర్గంలోని ఉపాధ్యక్షులు కార్యదర్శులు సంయుక్త కార్యదర్శులు ఆర్గనైజింగ్ కార్యదర్శులు ప్రచార కార్యదర్శులు ఈసీ మెంబర్లు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ